యాంకర్ రష్మీ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వెండితెరపై జబర్దస్త్ షో ద్వారా ప్రతి ఒక్కరికి పరిచయమైన రష్మీ ప్రస్తుతం స్టార్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. యాంకర్ గానే కాకుండా సినిమాల్లోను ఈ అమ్మడు అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా రష్మీ నటిస్తోంది. ఇక ప్రస్తుతం రష్మీ…. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి మొదలగు కార్యక్రమాల్లో యాంకర్ గా వ్యవహరిస్తోంది.
Rashmi Gautam is going to marry a businessman
ఇక రష్మీ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది సుధీర్. వీరిద్దరి మధ్య ప్రేమ నిజంగా ఉందా లేకపోతే అది కేవలం షో వరకేనా అనేది ప్రతి ఒక్కరికి అనుమానంగానే ఉంటుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీకి ఎంతోమంది అభిమానులు ఫిదా అవుతారు. వీరిద్దరూ పక్క పక్కన ఎన్నో రోజులు కలిసి ప్రేక్షకులను అలరించారు. ఇక ప్రస్తుతానికి వీరిద్దరూ కలిసి పార్టిసిపేట్ చేసి చాలా రోజులు అవుతుంది. సుదీర్ ప్రస్తుతం పలు సినిమా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉండడంతో ఎలాంటి షోలకి రావడం లేదు. వీరిద్దరూ వివాహం చేసుకుంటే చూడాలని ఎంతోమంది ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Advertisement
Advertisement
ఈ క్రమంలోనే రష్మీకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మీ ఒడిశాకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో ఏడడుగులు చేయబోతుందని, ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ విషయం తెలిసి ఎంతో మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. రష్మీ, సుధీర్ అభిమానులు ఈ వార్త ఫేక్ అంటూ కొట్టి పారేస్తున్నారు. మరి ఈ వార్తపై రష్మీ స్పందించే వరకు వేచి చూడాలి.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!