Home » Rashmi Gautam : యాసిడ్ పోస్తా అంటూ… యాంకర్ రష్మీకి బెదిరింపులు..!

Rashmi Gautam : యాసిడ్ పోస్తా అంటూ… యాంకర్ రష్మీకి బెదిరింపులు..!

by Bunty
Ad

రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు టీవీ రంగంలో మంచి పాపులర్ అయ్యారు. ఈటీవీలో వచ్చే కామెడీ షో జబర్దస్త్ లో యాంకరింగ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు. ఆమె తన యాంకరింగ్ తోనే కాకుండా అందచందాలతో మంచి గుర్తింపును సాధించింది. ప్రస్తుతం రష్మి ఓవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు యాంకరింగ్ లో కూడా అదరగొడుతున్నారు. అయితే తాజాగా రష్మీని ఓ నెటిజన్ తీవ్రంగా బెదిరించాడు. ఆ స్క్రీన్ షాట్ షేర్ చేసిన ఆమె దీనిపై ఫిర్యాదు చేయాలా? వద్దా? అని నెటిజన్లను ప్రశ్నిస్తూ పోస్ట్ చేసింది.

Advertisement

అసలు విషయానికి వస్తే హైదరాబాదులో ఇటీవల వీధి కుక్కల దాడికి ఓ బాలుడు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రష్మీ చాలా ఎమోషనల్ అయింది. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అయితే ఆమె నుంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ కొందరు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తుంటే మరికొందరు బెదిరిస్తూ మెసేజ్ లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ “నీ మీద చేతబడి చేయిస్తా. రోడ్డుమీద తిరగకు. ఇంట్లోనే ఉండు. నీ మీద యాసిడ్ పోస్తా.

Advertisement

మొండిగా ప్రవర్తిస్తే కష్టాల్లో పడతావు” అంటూ అందులో బెదిరింపులకు దిగాడు. దీంతో ఆ వ్యక్తి పంపిన బెదిరింపు మెసేజ్లను స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసింది. “ఈ నెటిజన్ కు గతంలో నా వయసు, పెళ్లి గురించి సమస్య ఉంది. ఇప్పుడు ఏకంగా నాకు చేతబడి చేసి యాసిడ్ పోయాలనుకుంటున్నాడు. నేను ఇప్పుడు ఫిర్యాదు చేయాలా”, అని రష్మీ ప్రశ్నించింది. ప్రస్తుతం రష్మీ పోస్ట్ వైరల్ గా మారింది.

READ ALSO : రాజమౌళికి అల్లు అరవింద్ మీద ఎందుకంత కోపం అంటే..ఆ విషయమే చిచ్చు పెట్టిందా ?

Visitors Are Also Reading