Home » Kailasa PM Ranjitha : నిత్యానంద రాజ్యానికి ప్రధానిగా నటి రంజిత!

Kailasa PM Ranjitha : నిత్యానంద రాజ్యానికి ప్రధానిగా నటి రంజిత!

by Bunty
Ad

మన ఇండియాలో దొంగ స్వామీజీలు చాలానే ఉన్నారు. ఏదో ఒక మూలాన దేవుడు తనతో ఉన్నాడంటూ జనాలను చాలామంది స్వామీజీలు మోసం చేసిన ఘటనలు మనం చూసే ఉంటాం. అలా జనాలను మోసం చేసి దేశం నుంచి పారిపోయిన స్వామి నిత్యానంద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలామంది అమ్మాయిలను తన ఆశ్రమంలో పెట్టుకొని… చాలా దారుణంగా వారితో ప్రవర్తించాడు వివాదాస్పద స్వామీజీ నిత్యానంద. అయితే ఆశ్రమంలోని అమ్మాయిలు ఫిర్యాదు చేయడంతో… ఈ దేశం నుంచే నిత్యానంద స్వామీజీ పారిపోయాడు.

Advertisement

ఇండియాను వదిలిన నిత్యానంద స్వామీజీ తనకంటూ ఒక ప్రత్యేక దేశాన్ని నిర్మించుకున్నాడు. ఇక స్వామీజీ నిత్యానంద నిర్మించుకున్న ఆ దేశానికి కైలాస దేశం అని పేరు పెట్టుకున్నాడు. వాస్తవానికి నిత్యానంద స్వామీజీ ఉన్నది ఒక ఐలాండ్. ఆ ఐలాండ్ కే కైలాస దేశం అని పేరు పెట్టుకున్నాడు నిత్యానంద స్వామీజీ. అక్కడితో ఆగకుండా తన దేశంలో ప్రత్యేక పాలన అలాగే ప్రత్యేక కరెన్సీ ఉండాలని కూడా… ప్రత్యేక కరెన్సీ కోసం రిజర్వ్ బ్యాంక్ తరహాలో ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నాడు స్వామీజీ నిత్యానంద. ఇక తాజాగా తన కైలాస దేశానికి… నటి రంజితను ప్రధానమంత్రిగా నియమించాడు నిత్యానంద స్వామి. ఈ విషయాన్ని ఓ ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక ప్రచురణ చేసింది.

Advertisement

నటి రంజితను ప్రధానమంత్రిగా నిత్యానంద స్వామి నియమించాడని… నిత్యానంద వెబ్ సైట్ లోను పేర్కొన్నారని సదరు ఇంగ్లీష్ పత్రిక క్లారిటీగా పేర్కొంది. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా నిత్యానంద ప్రియురాలు నటి రంజిత అప్పట్లో… తెలుగు అలాగే తమిళ అటు కన్నడ చిత్ర పరిశ్రమలో చాలా సినిమాలు చేసింది. ఆమెకు చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. కానీ నిత్యానంద స్వామీజీ మోజులో పడి అతనితో కైలాస దేశానికి వెళ్ళిపోయింది. అప్పట్లో నిత్యానంద స్వామీజీ మరియు నటి రంజిత మధ్య ఏదో సంబంధం ఉందని వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

Mohammed Shami : షమీ అరెస్ట్ తప్పదా? కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీం కోర్టు

2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..

Praveen Kumar : టీమిండియా బౌల‌ర్ ప్ర‌వీణ్ కుమార్ కారుకు ప్ర‌మాదం

 

Visitors Are Also Reading