Home » చనిపోయే ముందు నటుడు రంగనాథ్ గోడపై ఏమని రాసారో తెలిస్తే… కన్నీళ్లు ఆగవు!

చనిపోయే ముందు నటుడు రంగనాథ్ గోడపై ఏమని రాసారో తెలిస్తే… కన్నీళ్లు ఆగవు!

by Bunty
Ad

టాలీవుడ్ లో గుర్తుండిపోయే నటులలో సీనియర్ నటుడు రంగనాథ్ కూడా ఒకరు. బుద్ధిమంతుడు సినిమాతో రంగనాథ్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ తర్వాత 300కు పైగా సినిమాలలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను అలరించారు. 1974 సంవత్సరంలో చందన అనే సినిమాలో హీరోగా నటించిన ఆకట్టుకున్నారు. కాగా ప్రముఖ దర్శకుడు బాపు తెరకెక్కించిన అందాల రాముడు సినిమాలో హీరోగా నటించి ప్రేక్షకులను అలరించారు. కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగా చేసిన రంగనాథ్ ఇండస్ట్రీలో పోటీ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

Advertisement

 

ఆ తర్వాత హీరో అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో ఎలాంటి పాత్ర వచ్చిన చేస్తూ ముందుకు సాగారు. అలా గువ్వల జంట సినిమాతో రంగనాథ్ రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు, కృష్ణ, కృష్ణంరాజు లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి వారితో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. కేవలం సినిమాలు కాకుండా సీరియల్స్ లో కూడా నటించి రంగనాథ్ అభిమానులను సంపాదించుకున్నారు.

Advertisement

 

 

అదేవిధంగా నటనతో పాటు రచయితగా కూడా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక సినీ చరిత్రలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న రంగనాథ్ కొన్ని కారణాల వల్ల ఆత్మ* * చేసుకుని చనిపోయారు. కాగా ఆయన ఆత్మ**  చేసుకున్న తీరు అందర్నీ బాధింపజేసింది. అంతేకాకుండా ఆత్మ** చేసుకునే ముందు రంగనాథ్ తన ఇంట్లో గోడపై బొగ్గుతో మీనాక్షి అనే అమ్మాయికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని రాసి పెట్టారు. మీనాక్షి అనే అమ్మాయి రంగనాథ్ వద్ద పనిచేయగా, తనకోసం పనిచేసిన వ్యక్తి రుణం ఉంచుకోకూడదు అనే ఉద్దేశంతో రంగనాథ్ అలా రాసినట్టు తెలుస్తోంది.

READ ALSO : “పుష్ప”లో కేశవ పాత్రను వదిలేసుకున్న బిగ్ బాస్ స్టార్…అతను ఎవరో తెలుసా..?

Visitors Are Also Reading