Home » అందాల పోటీలకు ఎంపికైన రాజశేఖర్ కూతురు శివాని..!!

అందాల పోటీలకు ఎంపికైన రాజశేఖర్ కూతురు శివాని..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

రాజశేఖర్ ఎన్నో సినిమాలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న హీరో.. ఆయన తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక మంచి హోదా సంపాదించుకొని ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఆయన కూతురు శివాని కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఎంతో మంది ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె అందాల పోటీల్లో పాల్గొందట. ఈ విషయాన్ని స్వయంగా తానే బయటపెట్టేసింది. వెస్ట్ ఇండియా 2022 సంబంధించి ఆడిషన్స్ లో ఆమె పాల్గొంటున్నది.

Advertisement

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తూ ముంబైలో జరిగే ఫైనల్ ఆడిషన్స్ కు ఆమె బయలుదేరింది. ఈ ఆడిషన్స్ లో భాగంగా దాదాపుగా అన్ని రాష్ట్రాలలో పోటీలు జరిగాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎనిమిది మందిని సెలెక్ట్ చేశారు. ఇందులో రాజశేఖర్ కూతురు శివాని ఒకరు. ఇలా ప్రతి రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన ప్రాబబుల్స్ లో ముంబైలో ఫైనల్ ఆడిషన్స్ ను ఈ రోజే మొదలు పెట్టారు. ఈ ఆడిషన్స్ 18,19,20 తేదీల్లో జరగనున్నాయి. ఈ యొక్క ఫైనల్ ఆడిషన్స్ కు

 

దేశం మొత్తం 31 మందిని ఎంపిక చేశారట. అయితే ఈ 31మంది లో శివానికి చోటు దొరికితే తర్వాత జరిగే మిస్ ఇండియా పోటీలకు ఎంపిక అవుతుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిస్ ఇండియా కిరీటాన్ని గెలవడమే నా లక్ష్యమని, ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు అని ఎంతో కృషి పట్టుదల అవసరమని అంటోంది. దీని కోసం చాలా నెలలుగా ప్రిపేర్ అవుతున్నానని చెప్పుకొచ్చింది శివాని. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఈ పోటీలకు సన్నద్ధమవుతున్నానని అంటుంది.

Visitors Are Also Reading