Home » రఘురామకృష్ణంరాజు సర్వేలో టీడీపీకి తీపి కబురు.. ఏంటంటే..!!

రఘురామకృష్ణంరాజు సర్వేలో టీడీపీకి తీపి కబురు.. ఏంటంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రఘురామకృష్ణంరాజు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన పేరుకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కానీ చేసేవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలే. ఎప్పటికప్పుడు పార్టీలో కార్యక్రమాలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తన సొంత నియోజకవర్గమైన నరసాపురం ని ఆయన పూర్తిగా మరిచిపోయినట్టు తెలుస్తోంది. ఆయన ఎంపీగా గెలిచినప్పటి నుంచి తన సొంత నియోజకవర్గం సందర్శించే లేదట..

Advertisement

ALSO READ;ఎన్టీఆర్ అమిత్ షా భేటీకి తెర వెనుక ఉన్న‌దెవ్వ‌రు..? బీజేపీ ఇచ్చిన హింట్ అదేనా..?

ఎప్పుడు ఢిల్లీ లోనే ఉంటూ రచ్చబండ అనే పేరుతో వైసీపీపై, జగన్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు కృష్ణంరాజు.. అయితే తాజాగా కృష్ణంరాజు ఒక సర్వే నిర్వహించారట.ఆ సర్వే ఫలితాలు ఏంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఓడిపోతుందని, టిడిపి గెలవబోతుందని తన సర్వేలో వెళ్ళడయిందని చెప్పుకొచ్చారు రఘురామ. జూన్ మరియు జూలై నెలలో నిర్వహించిన ఈ సర్వేలో టీడీపీకి 93 స్థానాలు వస్తాయని, మరి కొన్ని స్థానాల్లో టిడిపి, వైసిపి నువ్వానేనా అన్నట్టుగా ఉంటుందని తేలిందట..

Advertisement

అందులో కనీసం సగం స్థానాల్లో టిడిపి గెలిచిన 120 నుండి 130 సీట్లు వస్తాయని, దీంతో టిడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రఘురామ సర్వేలో వెల్లడైందట. అయితే ఈ సర్వే ఫలితాలు విన్న తర్వాత టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం పెరిగి పోయిందట. ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం, చిత్తూరు జిల్లాలో టిడిపి ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని.. అలాగే కర్నూలులో కూడా అధిక స్థానాలు గెలుచుకుంటుందని తేలిందట.. కేవలం కడప లో మాత్రమే వైసిపి ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని రఘురామ సర్వేలో వెల్లడయింది. సీఎం ఎన్ని పథకాలు తీసుకువచ్చిన ప్రజలు సంతృప్తి చెందడం లేదని ఆయన చెబుతున్నారు.

ALSO READ;

పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న రామ్..!

Visitors Are Also Reading