పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా సినిమా రాధేశ్యామ్. ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమాకు మూడు రోజుల్లో ఎన్నికోట్ల బిజినెస్ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఐదు భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 79 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా 151 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసి అధికారికంగా ప్రకటించింది. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ తో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కానీ మార్చి 25న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. దాంతో ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ మార్చి 25 తరవాత రాధేశ్యామ్ కలెక్షన్ లపై పడే అవకాశాలు కూడా ఉన్నాయి.
Advertisement