కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో పలు చిత్రాలు విడులను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. అలా వాయిదా వేసుకున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్, భీమ్లానాయక్, రాధేశ్యామ్, సర్కారువారి పాట సహా మరికొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో కొత్త విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీని ప్రకటించిన సంగతి తెలింసిందే.
Also Read: తొలుత రాజమౌళి ప్రారంభం.. ఇప్పుడు అందరూ అదే పాటించడం..!
radhe shyam
మార్చి 25న ఆర్ఆర్ఆర్ ను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. కాగా ఇప్పుడు మరో భారీ బడ్జెట్ సినిమా రాధేశ్యామ్ ను కూడా మార్చి 11న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. యూవీక్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
Advertisement
Advertisement
The enthralling love story has a new release date! #RadheShyam in cinemas on 11th March! 🚢💕#RadheShyamOnMarch11#Prabhas @hegdepooja @director_radhaa @UV_Creations #BhushanKumar @TSeries @GopiKrishnaMvs @AAFilmsIndia pic.twitter.com/htqu6oQ5rA
— Radhe Shyam (@RadheShyamFilm) February 2, 2022