Home » చిరుతో పూరీ సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?

చిరుతో పూరీ సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ త‌ర‌వాత వ‌రుస సినిమాలు చేస్తున్నారు. గ్యాప్ లేకుండా సినిమాలు చేయ‌డంతో పాటూ డిఫ‌రెంట్ సినిమాల్లోనే న‌టించి అల‌రిస్తున్నారు. రీసెంట్ చిరంజీవి హీరోగా న‌టించిన ఆచార్య సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. ఇక ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే చిరంజీవి గాడ్ ఫాద‌ర్ సినిమా షూటింగ్ లో బిజీ అయ్యారు.

Advertisement

Advertisement

ఈ సినిమా లూసీఫ‌ర్ సినిమాకు రీమేక్ గా వ‌స్తోంది. ఇదిలా ఉంటే మెగాస్టార్ తో పూరీజ‌గ‌న్నాత్ సినిమా ఉంటుంద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ త‌ర‌వాత చిరు చాలా ప్రాజ‌క్టులు అనౌన్స్ చేశారు కానీ మెగాస్టార్ ప్రాజ‌క్టును మాత్రం అనౌన్స్ చేయ‌లేదు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పూరీ జ‌గ‌న్నాథ్ చిరుతో చేయాల్సిన సినిమా ఆగిపోయింద‌ని చెప్పారు. తాను చిరంజీవికి క‌థ‌ను వినిపించిన‌ట్టు తెలిపారు. కానీ సినిమా కథ న‌చ్చినా చిరంజీవి ఒకే చెప్ప‌లేద‌ని అన్నారు. దానికి కార‌ణంగా తాను చిరుకు క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ను వినిపించాన‌ని అన్నారు.

కానీ మెగాస్టార్ ప్ర‌స్తుతం స‌మాజం కోసం సినిమాలు చేయాల‌ని అనుకుంటున్నార‌ని అన్నారు. ఇక పూరీ జ‌గ‌న్నాత్ ఇప్ప‌టికే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో లైగ‌ర్ తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. మ‌రోవైపు పూరీ త‌దుప‌రి సినిమాను కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ తోనే అనౌన్స్ చేశారు.

Visitors Are Also Reading