Home » తమిళ స్టార్ హీరోలకు షాక్.. రెడ్ కార్డు ఇచ్చేందుకు నిర్మాతల మండలి సిద్ధం..!

తమిళ స్టార్ హీరోలకు షాక్.. రెడ్ కార్డు ఇచ్చేందుకు నిర్మాతల మండలి సిద్ధం..!

by Anji
Ad

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు కొన్ని సందర్భాల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేరు. సినిమాలకు భారీగా అడ్వాన్స్ తీసుకొని వారు నిర్మాతలకు సహకరించకపోవడం వంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల యాక్షన్ కింగ్ అర్జున్- విశ్వక్ సేన్ మధ్య వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా తమిళ హీరోలు శింబు, విశాల్, అధర్య, ఎస్ జే సూర్య, యోగిబాబులకు నిర్మాతల మండలి షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

ఈ ఐదుగురు హీరోలకు రెడ్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది నిర్మాతల మండలి. వీళ్లు  సినిమాకు భారీగా అడ్వాన్స్ తీసుకుని డేట్స్ ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు నిర్మాతలు. అడ్వాన్స్ తీసుకుని సంవత్సరాల కాలం గడుస్తున్నప్పటికీ కాల్షీట్స్  ఇవ్వకపోవడంపై నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమిళనాడు నిర్మాతల మండలి ఎన్ రామస్వామి నేతృత్వంలో జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్స్ వివిధ విషయాల కోసం జనరల్ కమిటీ సభ్యుల నుంచి ఆమోదం పొందారు.

Advertisement

ప్రధానంగా నిర్మాతల దగ్గర అడ్వాన్స్ తీసుకుని కాల్షీట్స్  ఇవ్వకపోవడంతో సినిమాలకు సహకరించకూడదని నిర్మాతల సంఘం నిర్ణయించుకుంది. శింబు, విశాల్,  ఎస్. జే. సూర్య , అధర్వ, యోగిబాబు నటుల సినిమాలకు సహకరించకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కొంతమంది నటీనటులు నటీనటుల సంఘం నుంచి వివరణ కోరాలని కోరింది. దీంతో నటీనటులు ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది నిర్మాతల మండలి. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

నెల‌కు రూ.700 జీతం కోసం సూర్య అలాంటి ప‌నులు చేసేవాడా..? సినిమాల్లోకి ఎలా వ‌చ్చాడంటే…?

దయచేసి నన్ను వదిలేయండి.. నాకు ఓ ఫ్యామిలీ ఉంది.. అనసూయ ట్వీట్ వైరల్..!

 పెళ్ళిలో ఆ తప్పు చేస్తే కొన్నాళ్ళకి భార్యాభర్తలు విడిపోతారా? అసలు ఆ తప్పు ఏమిటి?

Visitors Are Also Reading