ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని… ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు మహేష్ బాబు. ఏజ్ పైబడినప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ… దూసుకుపోతున్నాడు మహేష్ బాబు. ప్రస్తుతం గుంటూరు కారం సినిమా తో ఫుల్ బిజీ అయ్యాడు.
త్రివిక్రమ్ – ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా తర్వాత జక్కన్న దర్శకత్వంలో భారీ సినిమా చేయనున్నారు మహేష్ బాబు. ఈ సినిమా దాదాపు 1000 కోట్లతో తెరకెక్కనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయనున్నారు.
Advertisement
అయితే మొన్నటి వరకు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారం జరిగింది. ఇక తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటించబోతుందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు ప్రియాంకతో జక్కన్న చర్చలు కూడా చేశారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. కాగా మార్చి నెలలో జక్కన్న మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!