ఏపీలో సినిమా టికెట్ల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఏపీ సర్కార్ సినిమా ఇండస్ట్రీ నుండి పలువురు పెద్దలను పిలిచి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే సినిమా టికెట్ల పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు. అంతే కాకుండా భీమ్లా నాయక్ విడుదల నేపథ్యంలో మరోసారి ఆంక్షలను గుర్తుచేసింది. టికెట్ లను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
Advertisement
అంతే కాకుండా షోలపై కూడా సర్కార్ పరిమితులను విధించింది. అయితే ఈ అంశంపై తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఏపీ సర్కార్ తీరుపై ప్రకాష్ రాజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సృజన సాంకేతిక మేళవించిన సినిమారంగంపై అధికార దుర్వినియోగం…ఆదిపత్య దోరణి ఏంటని ప్రశ్నించారు. చిత్రపరిశ్రమను క్షోభ పెడుతూ మేమే ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా అంటూ ప్రశ్నించారు.
Advertisement
ఏదైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి…బాక్స్ ఆఫీస్ వద్ద ఎందుకని ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతగా ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డుకట్టవేయలేరు అంటూ ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రకాష్ రాజ్ తన పోస్ట్ లో ఏపీ ప్రభుత్వం…భీమ్లా నాయక్ అనే యాస్ టాగ్ లను జోడించారు. దయచేసి ఈ దాడికి స్వస్తి చెప్పండి…సినిమాను బతకనివ్వండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు.