Home » మార్చి 17న పునీత్ చివ‌రి సినిమా…ప్ర‌భాస్ ఎమోష‌న‌ల్ ట్వీట్..!

మార్చి 17న పునీత్ చివ‌రి సినిమా…ప్ర‌భాస్ ఎమోష‌న‌ల్ ట్వీట్..!

by AJAY
Ad

క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న హీరోగా న‌టించిన చివ‌రి సినిమా జేమ్స్ మార్చి 17న విడుద‌ల కాబోతుంది. ఈ సినిమా టీజ‌ర్ ను నిన్న విడుద‌ల చేయ‌గా పునీత్ రాజ్ కుమార్ ను త‌లుచుకుంటూ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఎమోష‌నల్ అయ్యారు. జేమ్స్ రూపంలో మ‌నం అద్భుత‌మైన కళా కండాన్ని చూడ‌బోతున్నాం. పునీత్ రాజ్ కుమార్ సార్ ను అభిమానించే ల‌క్ష‌లాది మందికి ఈ సినిమా ఎప్పుడూ ప్ర‌త్యేక‌మైన‌దే. వీ మిస్ యూ స‌ర్…అంటూ ప్ర‌భాస్ త‌న సోష‌ల్ మీడియాలో పేర్నొన్నారు.

Advertisement

prabhas

prabhas

దాంతో ప్ర‌భాస్ అభిమానులు సైతం ఎమోష‌న‌ల్ అవుతున్నారు. ప్ర‌భాస్ ఫ్యాన్స్ త‌ర‌పున ఈ సినిమా సూప‌ర్ హిట్ గా నిల‌వాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాను త‌ప్ప‌కుండా చూస్తామ‌ని చెబుతున్నారు. మ‌రోవైపు పునీత్ అభిమానులు కూడా ప్ర‌భాస్ కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నారు. పునీత్ ను త‌లుచుకుని ఎమోష‌న‌ల్ అవుతున్నారు. ఇక పునీత్ మ‌ర‌ణం త‌ర‌వాత విడుద‌ల‌వుతున్న ఈ సినిమా భారీ విజ‌యం సాధించాల‌ని ప్ర‌తిఒక్క‌రూ కోరుకుంటున్నారు.

Advertisement

Visitors Are Also Reading