Home » హెరిటేజ్ ఓనర్ కు వెన్నుపోటు పొడిచి.. ఆ కంపెనీని చంద్రబాబు సొంతం చేసుకున్నాడా ?

హెరిటేజ్ ఓనర్ కు వెన్నుపోటు పొడిచి.. ఆ కంపెనీని చంద్రబాబు సొంతం చేసుకున్నాడా ?

by Bunty

 

జైల్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడుపై పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. హెరిటేజ్ చంద్రబాబు పెట్టిందా…? ఆయన కష్టపడి పెట్టాడా…? మా సినిమా లెజెండ్ నుంచి హెరిటేజ్ ని కబ్జా చేశాడని సంచలన ఆరోపణలు చేశారు పోసాని కృష్ణ మురళి. హెరిటేజ్ ఓనర్ ను వెన్నుపోటు పొడిచాడు.. దోచుకున్నాడని అగ్రహించారు. సత్యమేవ జయతే అనే దీక్ష చేయకండి…సత్యం లేంది దీక్ష ఎందుకండి.? అంటూ టిడిపి నేతల దీక్ష పై సెటైర్లు పేల్చారు. సత్యమేవ జయతే కాదు మేడమ్ అసత్యమేవ జయతే అని పెట్టుకోండని భువనేశ్వరిపై అగ్రహించారు.

posani comments on heritage

posani comments on heritage

మన దేశానికి ఒక్కరే గాంధీ ఉంటే… ఏపీకి చంద్రబాబు, లోకేష్ ఇద్దరు జూనియర్ గాంధీలున్నారన్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో భర్తలను మించిపోయిన ఇద్దరు మహిళా నాయకులను చూస్తున్నాం…అత్తకోడళ్లు భువనేశ్వరి, బ్రాహ్మిణి అంటూ విమర్శలు చేశారు. మా ఆయన నిజాయితీ పరుడు…మాకేం తక్కువ డబ్బు కాజేయడానికి అని భువనేశ్వరి అంటున్నారు…కొడుకు నాశనం కావడానికి భువనేశ్వరినే కారణం అని ఫైర్ అయ్యారు. జైలుకు పంపడానికి కారణం జగనా.? జడ్జా.? చట్టం కదా జైలుకు పంపింది…బాబును జైలుకు పంపాలి అనుకుంటే నాలుగేళ్ల క్రితమే జైలుకు పంపేవాడని ఎద్దేవా చేశారు పోసాని కృష్ణ మురళి.

తన నాన్నకు చెప్పి చంద్రబాబును టిడిపి పార్టీలోకి తీసుకువచ్చావు…నాదెండ్ల భాస్కర్ టీడీపీలోకి బాబు రాకను తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ని చెప్పులతో కొట్టిస్తే.. భువనేశ్వరి ఆనంద పడింది…మా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కదా అని భువనేశ్వరి ఆనంద పడిందని అగ్రహించారు పోసాని కృష్ణ మురళి. మీ నాన్నని వెన్నుపోటు పొడిస్తే ఎందుకు ఆపలేవు…ఈ రాష్ట్రాన్ని మీరే ఏలాలి అని అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు పోసాని కృష్ణ మురళి.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading