Home » కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని.. ట్వీట్ చేసిన ప్రధాని మోదీ…!

కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని.. ట్వీట్ చేసిన ప్రధాని మోదీ…!

by Sravya
Ad

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలో ఫామ్ హౌస్ లో కేసీఆర్ గురువారం రాత్రి జారి పడిపోయారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తుంటి భాగంలో గాయమైంది. ఎముకకి స్వల్ప గాయం అయింది. నిపుణుల సంరక్షణలో ఉన్నారని కుమార్తె ఎమ్మెల్సీ కే కవిత చెప్పారు. త్వరలోనే మీ అందరి మద్దతు దీవెనలతో నాన్న కోలుకోవాలని ఆమె ట్వీట్ చేశారు. యశోద హాస్పిటల్ లోనే తొమ్మిదవ ఫ్లోర్ లో చికిత్స చేస్తున్నారు.

Advertisement

ఈరోజు పూర్తి టెస్ట్లు చేసి తర్వాత వైద్యులు హెల్త్ బులెటిన్ ఇస్తారని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ట్విట్ చేశారు. కేసీఆర్ గాయపడ్డారని తెలిసి బాధ కలిగిందని చెప్పారు మోడీ. ఆయన ఆరోగ్యం బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

గాయం నుండి కేసీఆర్ కోలుకోవాలని ట్విట్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ యశోద హాస్పిటల్ లో ఉన్న నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి కూడా పోలీస్ మానిటరింగ్ ని పెంచారు. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ని పరామర్శించడానికి పార్టీ నేతలు అంతా యశోద హాస్పిటల్ కి చేరుకుంటున్నారు.

పార్టీ ముఖ్య నేతలతో పాటుగా కార్యకర్తలు కూడా సోమాజిగూడ యశోద ప్రాంతానికి పెద్ద ఎత్తున వెళ్తున్నారు. నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిన వెంటనే కేసీఆర్ తన ఫామ్ హౌస్ కి వెళ్ళారు. ఆయన తొమ్మిదేళ్లగా ఉంటున్న నివాసం కార్యాలయాన్ని ఖాళీ చేసేసారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading