టాలీవుడ్ లోని టాప్ దర్శకులలో పూరీజగన్నాత్ కూడా ఒకరు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో పూరీజగన్నాత్ అభిమానులను సంపాదించుకున్నారు. తక్కువ సమయంలో సినిమా చేసి హిట్ కొట్టడంలో పూరీజగన్నాత్ తనకు తానే సాటి. అంతే కాకుండా ట్రెండ్ తగ్గట్టుగా హీరోను ఎంతో అందంగా స్టైలిష్ గా చూపించడంలో కూడా పూరీజగన్నాత్ కు పోటీ లేరనే చెప్పాలి. మొదటి సినిమానే పవన్ కల్యాణ్ తో చేసి బద్రి లాంటి సూపర్ హిట్ ను అందించారు.
Advertisement
ఈ సినిమా పవన్ కల్యాణ్ కెరీర్ ను మలుపుతిప్పడంతో పాటూ పూరీజగన్నాత్ ను కూడా స్టార్ డైరెక్టర్ గా మార్చింది. ఇక ఈ సినిమా తరవాత ఆయన వరుస సినిమాలు చేశారు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ ఇలా ఇండస్ట్రీలోని ప్రతి హీరోతోనూ సినిమా చేశాడు. ఇదిలా ఉంటే పూరీజగన్నాత్ కొడుకు ఆకాష్ పూరి కూడా ప్రస్తుతం సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Advertisement
మరోవైపు కూతురు పవిత్ర కూడా బుజ్జిగాడు సినిమాలో బాలనటిగా చేసి ఆకట్టుకుంది. ఈ సినిమాలో త్రిషస్థానంలో పవిత్ర నటించి అలరించింది. నటనతో ఆకట్టుకున్నప్పటికీ ఆ తరవాత మాత్రం పవిత్ర ఏ సినిమాలో కనిపించలేదు. ఇక రీసెంట్ గా ఆకాష్ పూరిని ఓ ఇంటర్వ్యూలో తన సోదరి పవిత్ర గురించి అడగ్గా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పవిత్ర సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందా అని ప్రశ్నించగా ఇస్తుందని చెప్పాడు.
కానీ పవిత్రకు నటనపై ఇంట్రెస్ట్ లేదని నిర్మాణరంగంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇదిలా ఉంటే పవిత్ర సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రస్తుతం పవిత్ర విదేశాల్లో తన చదువును పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తన ఫోటోలను పవిత్ర సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. దాంతో నెటిజన్లు మీరు హీరోయిన్ గా ప్రయత్రించవచ్చు కదా అంటూ కామెంట్స్ పెడతారు. కానీ పవిత్ర తనకు వచ్చే కామెంట్స్ ను పెద్దగా పట్టించుకోరు.