Home » పవన్ గెలవాలని.. మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన యువతి..!

పవన్ గెలవాలని.. మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన యువతి..!

by Sravanthi
Ad

పవన్ కళ్యాణ్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రస్తుతం ఫుల్ ఫోకస్ ని జనసేన పై పెట్టారు. పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలు కూడా చేస్తూ ఇంకోపక్క రాజకీయాల్లో దూసుకు వెళ్ళిపోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేశారు ఈ నెల నాలుగవ తేదీన ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల ఫలితాల కోసం ఏపీ ప్రజలు రాజకీయ నాయకులు మొత్తం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎవరికి వారు వారే గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు.

Advertisement

ఇది ఇలా ఉంటే కొందరు పార్టీ నాయకులు ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తుంది అని బెట్టింగులు కూడా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లేడీ అభిమాని పవన్ కళ్యాణ్ గెలవాలని ఏకంగా తిరుపతి మెట్లు ఎక్కింది. తిరుపతి మెట్లు ఎక్కడం పెద్ద కష్టమేం కాదు కానీ ఆమె ఎక్కింది మామూలు కళ్ళతో కాదు మోకాళ్ళతో పవన్ కళ్యాణ్ కోసం మోకాళ్ళతో మెట్లకి అభిమానాన్ని చాటుకుంది. ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయాన్ని కోరుతూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక యువతి మొక్కలపై తిరుపతి మెట్లు ఎక్కారు ఉండ్రాజవరానికి చెందిన పసుపులేటి దుర్గా రామలక్ష్మి స్థానికంగా ఆర్ఎంపి వైద్యం చేస్తారు.

Advertisement

Also read:

పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గెలవాలని ఆమె మొక్కుకున్నారు దీనిలో భాగంగా మే 25న సుమారు 450 మెట్లు మోకాళ్లపై ఎక్కినట్లు ఆమె తెలిపారు. పార్టీలతో తనకి సంబంధం లేదని పవన్ పై ఉన్న అమితమైన అభిమానంతోనే తిరుపతి మెట్లు ఎక్కినట్లు ఆమె చెప్పారు. పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో కచ్చితంగా గెలుస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు భవానీల అనుమతితో తిరుమల వెళ్లి మొక్కు తీర్చుకున్నానని ఆమె చెప్పారు ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి

Visitors Are Also Reading