Home » ప్రభాస్ ఇష్యూ వల్ల హర్ట్ అయ్యాను…అందుకే నిజాయితీగా ఉండకూడదు : నిత్యామీనన్

ప్రభాస్ ఇష్యూ వల్ల హర్ట్ అయ్యాను…అందుకే నిజాయితీగా ఉండకూడదు : నిత్యామీనన్

by AJAY
Ad

“అలా మొదలైంది” సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నిత్యామీనన్. మొదటి సినిమాతోనే నిత్యామీనన్ ప్రేక్షకుల మనసు దోచింది. ఈ సినిమాలో అల్లరి పిల్లగా నిత్యామీనన్ చేసే నటన టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో నిత్యామీనన్ ఫుల్ బిజీగా మారిపోయింది. మళ్లీ నితిన్ హీరోగా నటించిన ఇష్క్ సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటించి అలరించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అంతేకాకుండా నిత్యా మీనన్ ఎన్నో ఆఫర్లు వచ్చినా తన నటనకు ప్రాధాన్యం ఉన్న… మంచి కథ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తోంది.

Prabhas nitya Menon

Prabhas nitya Menon

ఇక రీసెంట్ గా నిత్యామీనన్ స్కైలాబ్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు నిత్యా మీనన్ నిర్మాతగా కూడా వ్యవహరించింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొన్న నిత్య మీనన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రెస్ మీట్ లో గతంలో తనకు జరిగిన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. ప్రభాస్ ఇష్యూ గురించి మాట్లాడుతూ… తను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తెలుగు సినిమాలు పెద్దగా చూడలేదని చెప్పింది. తనకు తెలుగు వచ్చేది కాదని అందుకే టాలీవుడ్ సినిమాలు చూసేది కాదని తెలిపింది. అయితే అదే సమయంలో ప్రభాస్ గురించి అడిగారని దాంతో తనకు తెలియదని చెప్పినట్టు పేర్కొంది.

Advertisement

Advertisement

 

ఆ విషయాన్ని పెద్దది చేశారని తన అమాయకత్వాన్ని ఉపయోగించుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తను ఏదో పెద్ద తప్పు చేసినట్లుగా వార్తలు వ్రాసారని వెల్లడించింది. జర్నలిస్టులు తన గురించి రాయడం తో చాలా బాధపడ్డానని తెలిపింది. అందుకే నిజాయితీగా అన్నిచోట్లా ఉండకూడదని… ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలని అర్థమైందని తెలిపింది. ప్రభాస్ ఇష్యూ ఇప్పటికి తనను బాధపెడుతూ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం నిత్యామీనన్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న “భీమ్లా నాయక్” సినిమాలో పవన్ కు భార్య గా నటిస్తోంది. దాంతో పవన్ కళ్యాణ్ నిత్యా మీనన్ ల జోడి ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Visitors Are Also Reading