Home » మెగా ఫ్యామిలీ సమక్షంలో మళ్ళీ కలవబోతున్న నిహారిక చైతన్య.. అందుకోసమేనా ?

మెగా ఫ్యామిలీ సమక్షంలో మళ్ళీ కలవబోతున్న నిహారిక చైతన్య.. అందుకోసమేనా ?

by Anji
Ad

 సాధారణంగా ఈ విషయాన్ని వినగానే చాలామందికి మెగా ఫ్యాన్స్ ఎంతగానో సంతోషపడతారు. ఏంటి నిజంగానే నిహారిక, జొన్నల గడ్డ చైతన్య మళ్ళీ ఒకటి కాబోతున్నారా లావణ్య త్రిపాఠి వచ్చిన వేళా విశేషం. ఇది నిజమే కావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కానీ ఇది కేవలం ఊహ మాత్రమే. ఎందుకంటే వీళ్లు కలవడం మళ్లీ జన్మలో జరగదు. అయితే నిహారిక జొన్నల గడ్డ చైతన్య మళ్ళీ మెగా ఫ్యామిలీ సమక్షంలో ఎందుకు కలుస్తున్నారు అని ప్రతి ఒక్కరిలో ఒక అనుమానం కలుగుతుంది. మరి వీళ్ళు కలవడానికి ప్రధాన కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


విడాకులు తర్వాత కూడా మళ్లీ మెగా ఫ్యామిలీ సమక్షంలో ఎందుకు కలుస్తున్నారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.మెగా డాటర్ నిహారిక జొన్నల గడ్డ చైతన్యల వివాహం పెద్దలు కుదుర్చినదే. వీరిద్దరి పెళ్లి జైపూర్ లో గ్రాండ్ గా చేశారు నాగబాబు. ఒక్కతే కూతురు కావడంతో నాగబాబు తన కూతురు పెళ్లిని ఎంతో గ్రాండ్ గా చేశారు. ఇక పెళ్లికి సంబంధించిన ఎన్నో వార్తలు అప్పట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ కరోనా సమయం కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకొని తక్కువ మంది బంధుమిత్రులతో వీరు పెళ్లి జరిగింది. అయితే అలా అంగరంగ వైభవంగా జరిగిన వీరి పెళ్లి మున్నాళ్ళ ముచ్చట గానే మారింది.

Advertisement

 


పెళ్లయిన కొద్ది రోజులకే వీరిమధ్య భేదాభిప్రాయాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల తర్వాత మొదటిసారి వీళ్ళిద్దరూ మెగా ఫ్యామిలీ సమక్షంలో కలవబోతున్నారట. దానికి ప్రధాన కారణం నిహారిక, జొన్నల గడ్డ చైతన్య కలిసి ఉన్న సమయంలో ఇద్దరు కలిసి తమకు సంబంధించిన డ్రీమ్ హౌస్ కట్టుకోవడానికి ఒక ఫ్లాట్ ని కొనుక్కున్నారట. అయితే ఆ ఫ్లాట్ లో ఇల్లు కట్టే సమయంలోనే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారట. ఈ ప్లాట్ ని ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్మాలని నిర్ణయం తీసుకున్నారట. దాంతో ఆ కొన్న వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఇద్దరు సంతకాలు కావాలని అడిగారట. కాబట్టి మెగా ఫ్యామిలీ సమక్షంలో మళ్లీ వీరిద్దరూ కలిసి రిజిస్ట్రేషన్ ఆఫీసులో సంతకాలు పెట్టబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading