Home » థియేటర్స్ కలెక్షన్స్ కంటే కిరాణా కొట్టు కలెక్షన్లు ఎక్కువ… జగన్ సర్కార్ పై నాని ఫైర్..!

థియేటర్స్ కలెక్షన్స్ కంటే కిరాణా కొట్టు కలెక్షన్లు ఎక్కువ… జగన్ సర్కార్ పై నాని ఫైర్..!

by AJAY
Ad

ఏపీలో సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం నియంత్రిస్తుండటం పై టాలీవుడ్ హీరోలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు తమ అసంతృప్తిని ప్రకటించారు. కాగా హీరో నాని కూడా ఇదివరకు రెండుసార్లు ఏపీలో సినిమా టికెట్ల ఇష్యూ పై మాట్లాడారు. తాజాగా ఆయన మరోసారి ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాని హీరోగా శ్యామ్ సింగరాయ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించారు.

Advertisement

NANI

NANI

ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదల కానుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాని మాట్లాడుతూ… సినిమా టికెట్ల ధరలు తగ్గించి ప్రేక్షకుడిని అవమాన పరిచారని అన్నారు. ధరలు పెంచినా టికెట్ కొనుక్కునే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని వ్యాఖ్యానించారు.

Advertisement

నలుగురికి ఉపాధి కల్పించే థియేటర్ల కలెక్షన్ల కంటే పక్కనే ఉన్న కిరాణాకొట్టు పెట్టుకున్న వారి కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి అంటూ నాని వ్యాఖ్యానించారు. గతంలో కూడా నాని ఏపీ ప్రభుత్వం టికెట్ల విషయంపై పునరాలోచన చేయాలని హితవు పలికారు. దాంతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పుడు మరోసారి టికెట్ ధరలపై స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. మరి నాని చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Visitors Are Also Reading