అక్కినేని నాగార్జున గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఎలాంటి పరపతిని ఉపయోగించుకోకుండా తనకు తానుగా హీరోగా మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇక నాగార్జున 40 పదుల వయసు దాటినప్పటికీ కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తూ ఇప్పటికీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.
Advertisement
ఇది ఇలా ఉండగా… నాగార్జున సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద సెలబ్రిటీ మరణించిన వారిని చూడడానికి వెళ్లడు అనే వార్త ఇండస్ట్రీలో, సోషల్ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. కృష్ణంరాజు మరణించిన సమయంలో కూడా ఎంతోమంది సెలబ్రిటీలు వచ్చి అతన్ని చివరిసారిగా చూసి వెళ్లారు కానీ నాగార్జున మాత్రం రాలేదు. దాసరి నారాయణరావు భార్య పద్మా మరణించిన సమయంలో మాత్రమే నాగార్జున వారి ఇంటికి వెళ్ళాడు. అది కూడా మూడవరోజు ఏదో పనిమీద వెళ్లి అక్కడ అతన్ని పరామర్శించి వచ్చారట. ఇక నాగార్జున ఎవరు మరణించిన వారి ఇంటికి వెళ్లరు.
Advertisement
కానీ తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు, తల్లి అన్నపూర్ణమ్మ మరణించిన సమయంలో సినీ ఇండస్ట్రీ మొత్తం తరలివచ్చారు. నాగార్జున ఎవరి ఇంటికి వెళ్లకపోయినప్పటికీ అతని కుమారులు మాత్రం నాగార్జునకి పూర్తిగా విభిన్నం. వారు ఎంత చిన్న సెలబ్రిటీ అయినా సరే వారు మరణిస్తే అక్కడికి వెళ్లి అఖిల్, నాగచైతన్య పరామర్శించి వస్తారు. కాగా, నవంబర్ 11వ తేదీన ప్రముఖ సెలబ్రిటీ చంద్రమోహన్ మృతి చెందినప్పటికీ ఎంతోమంది సెలబ్రిటీలు తరలివచ్చారు. నాగార్జున మాత్రం వెళ్లలేదని సమాచారం అందుతోంది. నాగార్జున ఎందుకు వెళ్లరు అనే విషయం ఇప్పటికీ తెలియరాలేదు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!