Home » తరుణ్, ఉదయ్ కిరణ్ కలిసి నటించాల్సిన సినిమా మధ్యలో ఎందుకు మిస్ అయ్యింది ? ఎవరు ఆపేసారు ?

తరుణ్, ఉదయ్ కిరణ్ కలిసి నటించాల్సిన సినిమా మధ్యలో ఎందుకు మిస్ అయ్యింది ? ఎవరు ఆపేసారు ?

by AJAY
Ad

టాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకొని అతి తక్కువ కాలంలో స్టార్ హీరోలుగా ఎదిగిన వారిలో ఉదయ్ కిర‌ణ్, త‌రుణ్ లు ముందు వరసలో ఉంటారు. 2000 సంవత్సరంలో వీరిద్దరూ హీరోలుగా మంచి సక్సెస్ మీద ఉండేవారు. ఉదయ్ కిరణ్ చిత్రం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి వరుస సూపర్ హిట్లను అందుకున్నారు. అదే సమయంలో తరుణ్ నువ్వే కావాలి సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు.

Advertisement

దాంతో వీరిద్దరూ లవర్ బాయ్ హీరోలుగా మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ఇక ఉదయ్ కిరణ్ చిత్రం సినిమా తర్వాత మనసంతా నువ్వే సినిమాతో మరో బ్లాక్బస్టర్ ను అందుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఎమ్మెస్ రాజు ఉదయ్ కిరణ్ హీరోగా నీ స్నేహం అనే సినిమాను నిర్మించారు.

Advertisement

ఈ సినిమా భారీ అంచనాల మధ్య 2002 నవంబర్ 1న విడుదల అయింది. మొదటి రోజు ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ఆ తర్వాత క్రమక్రమంగా కలెక్షన్లు తగ్గాయి. దాంతో ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కు స్నేహితుడి పాత్రలో జతిన్ గ్రేవాల్ నటించాడు. అతడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోవడంతో సినిమాకు మైనస్ అయింది.

నిజానికి ఈ పాత్ర కోసం మొదట ఎమ్మెస్ రాజు తరుణ్ ను సంప్రదించినట్టు ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. కానీ తరుణ్ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేసాడ‌ని తెలిపారు. దాంతో ఆ స్థానంలో జతిన్ ను తీసుకున్నామని ఉదయ్ కిరణ్ గనక ఈ సినిమా చేసి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేది అని ఎమ్మెస్ రాజు తెలిపారు. ఇక ప్ర‌స్తుతం ఉద‌య్ కిరణ్ పూర్తిగా ఈ లోకాన్ని విడిచిపోతే త‌రుణ్ సినిమాల‌కు పూర్తిగా దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే.

ALSO READ : వర్షం సినిమాలోని ఈ సీన్స్ లో మనకు కనిపించిన స్టార్ డైరెక్టర్ ని గుర్తు పట్టరా ?

Visitors Are Also Reading