Home » 24 గంటల్లో అత్యధిక మంది వీక్షించిన తెలుగు సినిమా ట్రైలర్స్..!

24 గంటల్లో అత్యధిక మంది వీక్షించిన తెలుగు సినిమా ట్రైలర్స్..!

by Azhar
Ad

ట్రైలర్ ను చూసి ఓ సినిమా ఎలా ఉంటుంది అని అభిమానులు విడుదలకు ముందే అంచనాకు వస్తుంటారు ప్రేక్షకులు. అయితే ట్రైలర్ బాగాలేకపోయిన సినిమాలు సూపర్ హిట్ కావడం… ట్రైలర్ అద్భుతంగా అనిపించినా… సినిమా ప్లాప్ కావడం వంటివి కూడా చాలా సార్లు జరిగాయి. కానీ ఆ ట్రైలర్స్ మాత్రం యూట్యూబ్ లో మాత్రం ఓ రేంజ్ లో వ్యూస్ సంపాదించుకుంటాయి. అలా ఇప్పటివరకు 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సంపాదించుకున్న తెలుగు సినిమా ట్రైలర్స్ ను ఇప్పుడు చూద్దాం.

రాధే శ్యామ్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజ హేగ్దే జంటగా నటించిన సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా ప మొదటి నుంచే భారీ అంచనాలు ఉండటంతో.. దీని ట్రైలర్ 24 గంటల్లో 23.20 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. కానీ సినిమా మాత్రం ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.

Advertisement

ఆచార్య : మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ఈ ఆచార్య సినిమా పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెంచుకున్నారు. దానికి తగ్గట్లుగానే ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో 21.86 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. చూడాలి మరి సినిమా ఎలా ఉంటుంది అనేది.

Advertisement

బాహుబలి 2 : దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచానికి తెలుగు సినిమాను బాహుబలి రూపంలో పరిచయం చేసాడు. కాబట్టి దాని తర్వాత వచ్చిన బాహుబలి 2 క్రేజ్ మాములుగా లేదు. దాంతో బాహుబలి 2 ట్రైలర్ కి 24 గంటల్లో 21.81 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

ఆర్ఆర్ఆర్ : బాహుబలి వాటి సినిమాను తీసిన దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలు స్వతంత్ర సమరయోధుల పాత్రలో కనిపించిన సినిమా ఆర్ఆర్ఆర్. కాబట్టి ఈ సినిమా ట్రైలర్ కి 24 గంటల్లో 20.45 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

వకీల్ సాబ్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత చేసిన సినిమా వకీల్ సాబ్. దాంతో ఈ సినిమా ఈ సినిమా ట్రైలర్ కి 24 గంటల్లో 18.05 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

Visitors Are Also Reading