Home » “రాధేశ్యామ్” లో బ్లండ‌ర్ మిస్టేక్…ఇది కూడా చూసుకోరా అంటూ ఫ్యాన్స్ ఫైర్..!

“రాధేశ్యామ్” లో బ్లండ‌ర్ మిస్టేక్…ఇది కూడా చూసుకోరా అంటూ ఫ్యాన్స్ ఫైర్..!

by AJAY
Ad

ప్రభాస్ అంటే బాహుబ‌లికి ముందు టాలీవుడ్ హీరో కానీ బాహుబ‌లి త‌ర‌వాత పాన్ ఇండియా స్టార్. ఒక్క సినిమాతో ప్రభాస్ కెరీర్ మొత్తం ఓ ములుపు తిరిగింది. బాహుబ‌లి సినిమా పార్ట్ 1 మరియు పార్ట్ 2 లు బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌డంతో దేశ‌వ్యాప్తంగా ప్ర‌భాస్ కు అభిమానులు పెరిగిపోయారు. బాలీవుడ్ హీరోయిన్ లు ద‌ర్శ‌కులు ప్ర‌భాస్ తో సినిమాలు చేసేందుకు క్యూ క‌డుతున్నారు. ఇక ఇప్ప‌టికే బాలీవుడ్ డైరెక్ట‌ర్ ల‌తో ప్ర‌భాస్ సినిమాలు కూడా చేస్తున్నారు.

radhe shyam

radhe shyam

ఇదిలా ఉంటే ప్ర‌భాస్ రీసెంట్ గా రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్ష‌కుల మందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.ఈ సినిమాకు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. మార్చి 11న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. అయితే ఈ సినిమా విష‌యంలో ప్ర‌భాస్ అభిమానులు కాస్త నిరాశ‌గానే ఉన్నారు. ప్ర‌భాస్ నుండి ఆశించిన స్ట‌ఫ్ ఈ సినిమాలో లేద‌ని హ‌ర్ట్ అయ్యారు.

Advertisement

ఓవ‌రాల్ గా కూడా ఈ సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. అయితే మేక‌ర్స్ మాత్రం ఇది ల‌వ్ స్టోరీ అని ముందు నుండే చెబుతున్నామ‌ని చెప్పిందే చూపించామ‌ని అంటున్నారు. ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ కాబ‌ట్టి అన్ని భాష‌ల వారికి న‌చ్చేలా సినిమాను చేశామ‌ని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రాధేశ్యామ్ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ సినిమాలో ఓ బ్లండ‌ర్ మిస్టేక్ చేశాడు.

ఈ సినిమాలో పూజాహెగ్డే ప్ర‌భాస్ ప్రెడిక్ష‌న్ ను త‌ప్పయ్యేలా చేసేందుకు త‌న‌కు తాను యాక్సిండెంట్ చేసుకుటుంది. అయితే ఆ త‌ర‌వాత పూజాహెగ్డే త‌లకు బ‌ల‌మైన గాయం త‌గ‌ల‌టంతో స‌ర్జరీ అవ‌స‌రం అవుతుంది.అయితే త‌ల‌కు స‌ర్జ‌రీ అంటే ఖ‌చ్చితంగా జుట్టు తీసేస్తారు. కానీ పూజా హెగ్డే కు మాత్రం జుట్టుతీయ‌కుండా అలానే ఉంచారు. ఇక ప్ర‌స్తుతం దీనిని నెటిజ‌న్లు ప‌సిగ‌ట్ట‌డంతో నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు.

 

Visitors Are Also Reading