Home » Manushi Chiller : టాలీవుడ్ కి మిస్ వరల్డ్ బ్యూటీ ఎంట్రీ.. హీరో అతడేనా ?

Manushi Chiller : టాలీవుడ్ కి మిస్ వరల్డ్ బ్యూటీ ఎంట్రీ.. హీరో అతడేనా ?

by Anji
Ad

టాలీవుడ్ లో ప్రతీ సంవత్సరం కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమే. అలాగే అందులో డైరెక్ట్ గా తెలుగు సినిమాతోనే ఫిల్మ్ కెరీర్ స్టార్ట్ చేసేవారు కొందరు ఉంటారు. మరికొందరు వేరే భాషల్లో ఆల్రెడీ చేస్తూ, తెలుగులో కూడా ఫేమ్ సంపాదించుకోవాలని కొందరు టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తారు. ఈ రెండో కోవలోకి మరో హీరోయిన్ కూడా చేరబోతోంది. ఆమె ఎవరో కాదు.. 2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న మనుషీ చిల్లర్.


హర్యానాకి చెందిన ఈ భామ మోడలింగ్ చేస్తూ సినిమాల్లోకి ప్రవేశించింది. గత ఏడాది బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన పృథ్వీ రాజ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ హీరోయిన్ కి మొదటి సినిమాయే ఫ్లాప్ గా నిలిచింది. అయినప్పటికీ మిస్ వరల్డ్ ఫేమ్ తో వరుస ఆఫర్లు దక్కించుకుంటుంది ఈ భామ. అలా మూడు సినిమాల్లో నటిస్తుండగా ఇప్పుడు తెలుగులోను ఎంట్రీ ఇస్తుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్ శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన  ఈ సినిమాలో హీరోయిన్ గా మానుషీ చిల్లర్ నటిస్తుందని చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది.

Advertisement

Advertisement

తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారత నేవి ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. డిసెంబర్ 8న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇక టాలీవుడ్ ఎంతోమందికి స్టార్ హీరోయిన్లు గా మార్చింది. మరి ఈ భామకు కూడా టాలీవుడ్ లోనే లుక్ రాసిపెట్టి ఉందేమో అని అనిపిస్తుంది. ఆపరేషన్ వాలంటైన్ హిట్ అయితే మానుషీ చిల్లర్ తెలుగులో వరుస ఆఫర్లు అందుకునే అవకాశం పుష్కలంగా ఉంది. ఇలాంటి వారికి తెలుగు ప్రేక్షకులు బాగానే ప్రిపరెన్స్ ఇస్తారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

అరగుండులో దర్శనమిచ్చిన సమంత.. ఇది వాస్తవమేనా ?

NTR: ఎన్టీఆర్ పక్కన హీరోయిన్స్ గా నటించిన ఈ తల్లీ కూతుళ్లు ఎవరో తెలుసా? ఏ ఏ సినిమాల్లో అంటే?

Visitors Are Also Reading