డైరెక్టర్ మెహర్ రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసినప్పటికీ అవి ఫ్లాప్స్ గా మిగిలిపోయాయి. మొదటగా కన్నడలో తెలుగు సినిమాలను రీమేక్ చేసి హిట్స్ కొట్టినటువంటి మెహర్ రమేష్ ఎంతో మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన కంత్రి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు మెహర్ రమేష్. ఆ తర్వాత బిల్లా, శక్తి, షాడో వంటి సినిమాలు చేశాడు.
ఈ మూడు సినిమాలు ఫ్లాప్స్ అవడంతో మెహర్ రమేష్ ఇండస్ట్రీకి కాస్త దూరమయ్యాడు. ఇక ఇతనికి చాన్సులు రావని ప్రతి ఒక్కరు ఫిక్స్ అయిపోయారు. కానీ కొన్ని రోజులపాటు గ్యాప్ తీసుకున్నటువంటి మెహర్ ఏకంగా చిరంజీవితో కలిసి బోలా శంకర్ సినిమాని తీశాడు. ఈ సినిమా ఎలాగైనా హిట్ అవుతుందని భావించిన రమేష్ కి మళ్లీ భారీ డిజాస్టర్ మిగిలింది. మెగాస్టార్ కెరియర్ లోనే అత్యంత చెత్త సినిమాగా బోలా శంకర్ సినిమా నిలిచింది. ఇక మళ్ళీ కొంత గ్యాప్ తీసుకున్న మెహర్ ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనుకుంటున్నాడట.
Advertisement
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఎప్పటికైనా నేను పవన్ కళ్యాణ్ తో సినిమా చేసి తీరుతానని… అందుకోసం సినిమా కథను కూడా సిద్ధం చేసుకున్నానని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెహర్ రమేష్ ఇంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు అంటే పవన్ కళ్యాణ్ తో తీయబోయే సినిమా అయినా హిట్ అవుతుందేమోనని పవన్ కళ్యాణ్ అభిమానులు భావిస్తున్నారు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!