Home » చిరంజీవిపై పరువు నష్టం కేసు దావా వేసిన తమిళ నటుడు.. అసలేం జరిగిందంటే?

చిరంజీవిపై పరువు నష్టం కేసు దావా వేసిన తమిళ నటుడు.. అసలేం జరిగిందంటే?

by Srilakshmi Bharathi
Ad

మొన్నామధ్య తమిళ నటుడు మన్సూర్​ అలీఖాన్ కు, టాలీవుడ్ నటి త్రిషకు మధ్య వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారి చిరంజీవిని చుట్టుముట్టింది. తమిళ నటుడు మన్సూర్​ అలీఖాన్ చిరంజీవి, ఖుష్బూ, త్రిషలపై పరువు నష్టం కేసు దావా వేశారు.

chiranjeevi-and-venkatesh-photos

chiranjeevi-and-venkatesh-photos

వీరు సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టను దిగజార్చాయన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయినా వీడియోను మొత్తం చూడకుండా.. వీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు అంటూ ఆగ్రహించారు. వారి నుంచి కోటి రూపాయలు డిమాండ్ చేస్తూ కేస్ వేశారు.

Advertisement

లియో మూవీలో తనకి నటిస్తున్నట్లు అవకాశం వచ్చిందని తెలిసినప్పుడు త్రిషతో రేప్ సీన్ ఉంటుందని అనుకున్నానని.. త్రిషను ఎత్తుకుని బెడ్ రూమ్ లోకి వెళ్లే సీన్ ను ఊహించుకున్నానని.. కానీ లోకేష్ కనీసం త్రిషను చూపించను కూడా చూపించలేదని.. ఇప్పటివరకు ఎన్నో రేప్ సీన్స్ చేశాను కానీ, ఇది కొత్తగా ఉంటుందని అనుకున్నానని” మన్సూర్ చేసిన కామెంట్స్ పై త్రిష తీవ్రంగానే స్పందించారు. ఇంకెప్పటికీ అతనితో నటించేది లేదని చెప్పింది.

అయితే.. త్రిషను దర్శకుడు లోకేష్, సింగర్ చిన్మయి, టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి, నితిన్‌, రోజా, రాధిక, కుష్బులు మద్దతు ఇచ్చారు. ఆ తరువాత రెస్పాండ్ అయినా మన్సూర్ త్రిష అంటే తనకి గౌరవం ఉందని, నేను ఎలాంటి వాడినో అందరికి తెలుసు అని, సరదాగా అన్న మాటలకి ఇంత దుమారం రేగుతుందని అనుకోలేదని స్పష్టత ఇచ్చారు. అయితే మన్సూర్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమీషన్ సీరియస్ గా తీసుకుని ఆయనపై కేసు నమోదు చేయాలనీ తమిళనాడు పోలీస్ శాఖని కోరింది. అయితే.. సోషల్ మీడియా వేదికగా త్రిషకి క్షమాపణలు చెప్పిన మన్సూర్ తనపై అవమానకర వ్యాఖ్యలు చేసారు అంటూ చిరంజీవి, ఖుష్బూ, త్రిషలపై పరువు నష్టం కేసుని వేశారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading