Home » తప్పు చేశానమ్మా.. నన్ను క్షమించండి.. మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్లపై పడిన వ్యక్తి

తప్పు చేశానమ్మా.. నన్ను క్షమించండి.. మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్లపై పడిన వ్యక్తి

by Bunty
Ad

ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ హాట్‌ హాట్‌ గానే ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించలేము. ఇక ఏపీలో పరిటాల కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ పరిటాల కుటుంబం కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా కొంత మంది సిద్ధంగా ఉంటారు. అయితే, తాజాగా పరిటాల కుటుంబానికి అరుదైన సంఘటన ఎదురైంది. అమ్మా, నన్ను క్షమించు, వైసీపీ పార్టీ లో చేరి తప్పు చేశాను అంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్లపై ఓ కార్యకర్త పడి ప్రాధేయపడ్డారు.

Advertisement

టిడిపి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది. ఇందులో భాగంగా, సోమవారం అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో పరిటాల సునీత ఆధ్వర్యంలో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మచ్చుమర్రీ గ్రామానికి చెందిన రామాంజనేయులు మాజీ మంత్రి సునీత కాళ్లపై పడ్డారు. అమ్మా, వైసీపీ పార్టీ  లో చేరి తప్పు చేశాను. నన్ను క్షమించు అమ్మా అంటూ వేడుకున్నారు.

Advertisement

వైసీపీ పార్టీ లో చేరి తప్పు చేశానని, తనను మళ్ళీ టిడిపిలో చేర్చుకోవాలంటూ ప్రాధేయపడ్డారు. దీంతో రామాంజనేయులు ఆమె పైకి లేపి, మీలాంటి వారికి పార్టీలో ఎప్పటికి స్థానం ఉంటుందని భరోసా ఇస్తూ, అక్కడే టిడిపి కండువా కప్పి, టిడిపి సభ్యత్వం కల్పించారు. అయితే, ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన తెలుగు దేశం అభిమానులు, పరిటాల అభిమానులు ఖుషీ అవుతున్నారు.

READ ALSO : అంత్యక్రియల్లో కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు… ఎందుకో తెలుసా?

Visitors Are Also Reading