Home » మహేష్ ఖాతాలో మరో ఖరీదైన ఆస్తి

మహేష్ ఖాతాలో మరో ఖరీదైన ఆస్తి

by Bunty
Ad

సూపర్ స్టార్ మహేష్ మహేశ్‌ బాబు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ ఖరీదైన ఆస్తిని కొనుగోలు చేశారు. రూ. 26 కోట్లతో ప్లాట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. 1,442 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్‌ను మహేష్ బాబుకు యర్రం విక్రాంత్ రెడ్డి విక్రయించారు. అతను ఇంతకుముందు అక్కడ ఉన్న తన ఇంటిని కూల్చి వేసి కొత్త నిర్మాణాన్ని నిర్మించాలని ప్లాన్ చేశాడు. కానీ మారిన పరిస్థితుల కారణంగా ప్లాట్ ను విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సేల్ డీడ్ నవంబర్ 17, 2021 న రిజిస్టర్ చేశారు. మహేష్ బాబు రూ. 1.43 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ. 39 లక్షల ట్రాన్స్‌ఫర్ డ్యూటీని చెల్లించినట్లు డాక్యుమెంట్స్ లో ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మహేష్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

Advertisement

mahesh

Advertisement

జూబ్లీహిల్స్‌లోని ప్లాట్ సైజులు సాధారణంగా 1,000 చదరపు గజాల కంటే ఎక్కువగా ఉంటాయి. ఒక చదరపు గజానికి రూ. 1.5 లక్షల నుండి రూ. 2 లక్షల వరకు లభిస్తాయని, ఆ ప్రాంతంలో యాక్టివ్‌గా ఉన్న బ్రోకర్లు తెలిపారు. నగరంలోని ప్రముఖులు అక్కడ నివసిస్తారు. ఇక్కడ నోటి మాట ద్వారా లావాదేవీలు జరుగుతాయి. హైదరాబాద్ మరియు బెంగళూరు వంటి మార్కెట్లలో ప్రాపర్టీ ధరలు 2 నుండి 6 శాతం వరకు పెరిగాయి. కాగా సెప్టెంబర్‌లో పవన్ కళ్యాణ్ జూబ్లీహిల్స్‌లోని 676 గజాల బంగ్లాను రూ.12 కోట్లకు కొనుగోలు చేశారు. నటుడు, రాజకీయ నాయకుడు చిరంజీవి తమ్ముడు స్టాంప్ డ్యూటీ రూ.66 లక్షలు, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ రూ.18 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.6 లక్షలు, మ్యుటేషన్ చార్జీలు రూ.1.2 లక్షలు చెల్లించినట్లు సమాచారం.

Visitors Are Also Reading