Home » మంత్రి రోజాకు లోకేష్ కౌంటర్.. మామూలుగా లేదుగా..?

మంత్రి రోజాకు లోకేష్ కౌంటర్.. మామూలుగా లేదుగా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

గత కొంతకాలంగా మంత్రి రోజా రాజకీయాల్లో చాలా చురుకుగా ఉంటుంది. ఆపోజిషన్ వాళ్లు మాట్లాడిన మాటలకు చాలా స్పీడ్ గా కౌంటర్ ఇస్తూ దూసుకుపోతోంది. అలాంటి రోజాకు తాజాగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు.. రోజా అవినీతిని ప్రశ్నిస్తే.. మహిళలను కించపరిచినట్టా.. తన పళ్ళు రాలగొడతానని రోజా వార్నింగ్ లు ఇస్తుందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు పళ్ళు రాలగొట్టాల్సి వస్తే ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పళ్ళు రాలగొట్టండి అంటూ రోజాకు కౌంటర్ ఇచ్చారు లోకేష్. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం లో మహిళలతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు.

Advertisement

Advertisement

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు తనకు చీర,గాజులు పంపుతానని ప్రకటించే రోజాకు తెలుగు మహిళలు సారె పెట్టేందుకు వెళ్తే వారిని అరెస్టు చేయించిందని మండిపడ్డారు. సాటి మహిళల్ని అత్యంత దారుణంగా కొట్టించి అరెస్టు చేయించిన రోజా ఇలా మహిళల గురించి మాట్లాడడం సిగ్గు సిగ్గు అన్నారు. తన తల్లిని అసెంబ్లీలో అవమానపరిచినప్పుడు ఏమైంది ఈ రోజా.. అప్పుడు జగన్ రెడ్డి పళ్ళు రాలగొట్టలేదు ఎందుకు అంటూ ప్రశ్నించారు. అవినీతి ఆరోపణల పైన స్పందిస్తూ వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబుపై 16 హౌసు కమిటీలు,ఎనిమిది సిఐడి కేసులు పెట్టారని ఒక్కటి కూడా ప్రూఫ్ చేయలేకపోయారని అన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లక్ష్మీ పార్వతి కూడా తమపై సుప్రీంకోర్టులో వేసిన కేసుల్లో కనీసం ఆధారాలు కూడా చూపలేకపోయారని,దీంతో కోర్టు కేసులను కొట్టి వేసిందని లోకేష్ తెలియజేశారు. మేము చిత్తశుద్ధితో పనిచేస్తామని, మా ఆస్తిపాస్తులు ఏటా ప్రకటిస్తామని, మీ వైసీపీలో ఉన్న 150 మంది ఆస్తులు ప్రకటించాలని నారా లోకేష్ ప్రశ్నించారు. మరి చూడాలి ఈ విషయం ఏ వైపుకు దారితీస్తుందో.

also read:

Visitors Are Also Reading