Home » ‘బిగ్ బాస్ 5’కి ట్రిపుల్ టచ్… జక్కన్నతో మెగా ప్లాన్

‘బిగ్ బాస్ 5’కి ట్రిపుల్ టచ్… జక్కన్నతో మెగా ప్లాన్

by Bunty

బిగ్ బాస్ 5 రియాల్టీ షో ఇంకా కేవలం ఒక వారం మాత్రమే మిగిలి ఉంది. దాదాపు వంద రోజులకు పైగా ఆసక్తికరంగా సాగిన ఈ షోలో ఇప్పుడు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. అందులో సింగర్ శ్రీరామచంద్ర, విజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, సిరి హనుమంత్, మానస్ ఉన్నారు. ఈ ఐదుగురు కంటెస్టెంట్స్ లో ఒకరు విన్నర్ గా వచ్చే ఆదివారం బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ట్రోపీ అందుకోబోతున్నారు. దాంతోపాటు విన్నర్ కు 50 లక్షల ప్రైజ్ మనీ కూడా దక్కనుంది. ఇక ఈ ఐదుగురు లో విన్నర్ ఎవరు కానున్నారు అన్న విషయంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తుండగా… ఫైనల్ ఎపిసోడ్ కోసం చేస్తున్న ఏర్పాట్లు కూడా ఉత్కంఠతను రేకెత్తిస్తున్నాయి.

సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ లో ఈ సీజన్లో ఇప్పటికే హౌస్ నుంచి వెళ్లిపోయిన కంటెస్టెంట్స్ అంతా ప్రత్యేకంగా పర్ఫార్మ్ చేయనున్నారు. ఇక స్టార్ హీరోయిన్లు సైతం ఈ వేదికపై చిందెయ్యనున్నారు. రామ్ చరణ్, తారక్ కూడా బిగ్ బాస్ ఫైవ్ వేదికపై సందడి చేయనున్నారు. అంతేకాకుండా దర్శక దిగ్గజం రాజమౌళి బిగ్ బాస్ విన్నర్ అందజేయనున్నారు అని అంటున్నారు. ఈ వార్తలు వింటుంటే ఆ చివరి ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు ప్రసారం అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.

Visitors Are Also Reading