Home » తార‌క‌ర‌త్న ఆస్ప‌త్రి బిల్ క‌ట్టింది బాల‌య్య కాదు..ల‌క్ష్మీపార్వ‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

తార‌క‌ర‌త్న ఆస్ప‌త్రి బిల్ క‌ట్టింది బాల‌య్య కాదు..ల‌క్ష్మీపార్వ‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

by AJAY
Ad

నంద‌మూరి హీరో తార‌క‌ర‌త్న ఇటీవ‌ల గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. కొన్నిరోజుల పాటూ తార‌క‌ర‌త్న ఆస్ప‌త్రిలో మృత్యువుతో పోరాడుతూ క‌న్నుమూశారు. అయితే తార‌క‌ర‌త్న ఆస్ప‌త్రిలో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న ఆరోగ్యం గురించి బాల‌య్య ఎప్ప‌టిక‌ప్పుడు ఆరాతీస్తున్నారని అంతే కాకుండా ఆస్ప‌త్రి బిల్ సైతం ఆయ‌నే క‌డుతున్నార‌ని వార్తలు వినిపించాయి.

ALSO READ :భూమా మౌలిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా… మనోజ్ కంటే ఎక్కువేనా?

Advertisement

దాంతో బాల‌య్య పై అభిమానులు ప్ర‌శంస‌లు కురిపించారు.కాగా తాజాగా ఎన్టీఆర్ రెండో భార్య ల‌క్ష్మీపార్వ‌తి ఈ విష‌యం పై స్పందించారు. అంతే కాకుండా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తార‌క‌ర‌త్న బెంగుళూరు లోని నారాయ‌ణ హృద‌యాల‌య ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకున్నార‌ని 23 రోజుల పాటూ చికిత్స తీసుకున్నార‌ని చెప్పారు. అంతే కాకుండా ఆస్ప‌త్రి బిల్ బాల‌య్య క‌ట్ట‌లేద‌ని విజ‌య‌సాయిరెడ్డి క‌ట్టార‌ని చెప్పారు.

ALSO READ :మంచు, అక్కినేని ఫ్యామిలీకి ఆ ఒక్కటి కలిసి రావడం లేదా..?

Advertisement

NTR

మా కుటుంబంలో డ‌బ్బులు పెట్టాలంటే ఆలోచిస్తార‌ని ఆయ‌నే కాదు పిల్ల‌లు కూడా అంతేన‌ని అన్నారు. అంతే కాకుండా మా క‌మ్యునిటీలోనే అంతే ఉంటారు…మనీ మైండెడ్ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అలేఖ్య‌రెడ్డి తండ్రి ఆమెకు ఇల్లు ఇచ్చార‌ని అందులోనే వాళ్లు ఉండేవార‌ని ల‌క్ష్మీపార్వ‌తి వెల్ల‌డించారు.

ntr laxmi parvathi

ntr laxmi parvathi

బాల‌కృష్ణ చొర‌వ‌చూపి డ‌బ్బులు ఇవ్వ‌క‌పోయినా ప‌ర్వాలేదు…కానీ మోహ‌న‌కృష్ణ తో మాట్లాడి ఆ బిడ్డ‌ల భ‌విష్య‌త్ గురించి ఆలోచించాల‌ని చెప్పారు. ఇక ప్ర‌స్తుతం ల‌క్ష్మీపార్వతి చేసిన కామెంట్ లు వైర‌ల్ అవుత‌న్నాయి. గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో ల‌క్ష్మీపార్వ‌తి మాట్లాడుతూ..తార‌క‌ర‌త్న ముందే చ‌నిపోయార‌ని కానీ లోకేష్ యాత్ర‌పై ఎఫెక్ట్ ప‌డుతుంద‌నే విష‌యాన్ని దాచార‌ని కామెంట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

also read :Telugu TV Anchors: తెలుగు యాంక‌ర్స్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారో తెలుసా..అందరికంటే ఎక్క‌వ ఎవ‌రికంటే..?

Visitors Are Also Reading