Home » దానివ‌ల్ల ప్ర‌భాస్ ఫ్యాన్స్ లో అసంత్రుప్తి..కృష్ణం రాజు షాకింగ్ కామెంట్స్..!

దానివ‌ల్ల ప్ర‌భాస్ ఫ్యాన్స్ లో అసంత్రుప్తి..కృష్ణం రాజు షాకింగ్ కామెంట్స్..!

by AJAY
Ad

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన తాజా చిత్రం రాధేశ్యామ్. రీసెంట్ గా విడుద‌లైన ఈ సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. ఈ చిత్రానికి జిల్ సినిమా ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా యూవీక్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై సినిమాను నిర్మించారు. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా కేసులు ఒక్క‌సారిగా పెర‌గ‌టంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఇక ఈనెల 11న సినిమా విడుద‌ల కాగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ కుషీ అవుతున్నారు.

Advertisement

Advertisement

ఇదిలా ఉండ‌గా ఈ సినిమాలో ప్ర‌భాస్ పెద‌నాన్న కృష్ణం రాజు కూడా ముఖ్యమైన పాత్ర‌లో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌భాస్ కృష్ణం రాజు క‌లిసి రెబల్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌గా వీరిద్ద‌రూ క‌లిసి న‌టించిన రెండో సినిమా రాధేశ్యామ్..ఈ సినిమాలో కృష్ణం రాజు ప‌ర‌మ‌హంస అనే పాత్రలో న‌టించి అల‌రించారు. ఇక సినిమా విడుద‌ల నేపథ్యంలో ఓ ఇంట‌ర్వ్యూలో కృష్ణం రాజు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. ప్ర‌భాస్ అభిమానులు ఒక్క విష‌యంలో మాత్రం అసంత్రుప్తితో ఉన్నార‌ని అన్నారు.

ప్ర‌భాస్ కేవ‌లం ఏడాదికి ఒకే సినిమాతో రావ‌డం ఫ్యాన్స్ ను నిరాశ‌ప‌రుస్తుంద‌ని అన్నారు. దాంతో ప్ర‌భాస్ ఏడాదికి రెండు సినిమాల‌ను విడుద‌ల చేయాల‌ని నిర్ణయం తీసుకున్నాడ‌ని చెప్పారు. ఇక రాధేశ్యామ్ లో తాను చేసిన పాత్ర చూసి దేవుడిలా ఉన్నావంటూ ప్ర‌భాస్ త‌న‌తో చెప్పార‌ని తెలిపారు. నిజానికి రాధేశ్యామ్ త్వర‌లోనే విడుద‌ల చేయాలి కానీ క‌రోనా వ‌ల్ల ఆల‌స్యం అయ్యింద‌ని కృష్ణం రాజు వెల్ల‌డించారు.

Visitors Are Also Reading