Home » పోలీసులను ఆశ్రయించిన కమల్ హాసన్ మాజీ భార్య…!

పోలీసులను ఆశ్రయించిన కమల్ హాసన్ మాజీ భార్య…!

by Bunty
Published: Last Updated on

సీనియర్ నటి గౌతమి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అయితే ఈ మధ్యకాలంలో చాలా రోజులుగా సినిమాలలో పెద్దగా కనిపించడం లేదు. తాజాగా నటి గౌతమి పోలీసులను ఆశ్రయించిందట. 25 కోట్ల విలువైన తన స్థలాన్ని కబ్జా చేశారని, అలా ఎందుకు చేశారని ప్రశ్నించింది.

అందుకు తనని, తన కూతురిని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆమె ఫిర్యాదు చేసింది. గౌతమ్ కి తమిళనాడులోని పలు ప్రాంతాల్లో 46 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఇక ఈమధ్య తనకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో కొంత ఆస్తిని తన అనారోగ్యం కారణంగా అమ్మేయాలని ఆమె నిర్ణయించుకుందట. దానికి సంబంధించిన పనిని ఓ ఏజెంట్ కి అప్పగించింది. కానీ ఆ ఏజెంట్ ఆస్తిపై కన్నేసి ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలను సృష్టించి ఆస్తిని అంత తన సొంతం చేసుకున్నాడు. ఇదేంటని గౌతమీ ప్రశ్నించగా… రాజకీయ అండదండలతో ఏజెంట్ బెదిరింపులకు పాల్పడ్డాడు. తనని, తన కూతురిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని గౌతమి చెప్పుకొచ్చింది. ఈ సమస్యల కారణంగా తన చదువు కూడా చాలా డిస్టర్బ్ అవుతుందని ఫిర్యాదులో పేర్కొంది. తన నుంచి కాజేసిన 25 కోట్ల ఆస్తిని తనకు అప్పగించాలని అభ్యర్థించింది.

తనపై బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ ఘటనపై కేసు ఫిర్యాదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, గౌతమి సందీప్ పాండ్యా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఒక కూతురు జన్మించింది. ఇక కొన్ని అనివార్య కారణాలవల్ల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తనతో పాటు తన కూతురిని తనే చూసుకుంటుంది గౌతమి. కాగా, కొన్నాళ్లపాటు కమలహాసన్ తో కూడా కలిసి ఉంది గౌతమి. కొన్ని రోజులకి అతనితో కూడా విడిపోయింది. ఇక ఇప్పుడు తన కూతురుతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది.

Visitors Are Also Reading