Home » భ‌ర్త‌తో గొడ‌వ‌.. పిల్ల‌ల గొంతు కోసిన భార్య

భ‌ర్త‌తో గొడ‌వ‌.. పిల్ల‌ల గొంతు కోసిన భార్య

by Sravan Sunku
Ad

భార్యాభర్తల మధ్య జరిగిన గొడవకు కన్నపిల్లలే బ‌ల‌య్యారు. క్ష‌ణికావేశంలో క‌న్న‌త‌ల్లే ఇద్దరు చిన్నారుల ప్రాణాల‌ను పొట్ట‌న పెట్ట‌కున్న‌ది. హ‌త్య త‌రువాత మృతదేహాలు ఉన్న గ‌దిలోనే ఉండిపోయింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని బ‌రేలీ భూటా పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో మ‌ట్కాపూర్ గ్రామంలో నివ‌సించే బంటూ, జ‌యంతి భార్య భ‌ర్త‌లు. వీరు వ్య‌వ‌సాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తున్నారు. గురువారం అర్థ‌రాత్రి బంటు, జ‌యంతి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది.

 

Advertisement

Advertisement

ఆగ్ర‌హంతో జ‌యంతి పిల్ల‌లు నిద్రిస్తున్న గ‌దిలోకి వెళ్లి లోప‌లి నుంచి తాళం వేసుకొని నిద్రించింది. అదే స‌మ‌యంలో బంటు త‌న గ్రామంలోనే మ‌రో ఇంట్లో నివసిస్తున్న త‌ల్లిదండ్రుల వ‌ద్ద‌కు వెళ్లిపోయాడు. బంటూ వ‌చ్చే స‌రికి ఎలాంటి స్పంద‌న లేదు. కొద్ది సేప‌టికే అక్క‌డ ఇరుగు పొరుగు వారు గుమికూడారు. వారి స‌హాయంతో త‌లుపులు ప‌గుల‌గొట్టి చూశారు. అప్ప‌టికే ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్న చిన్నారుల మృత‌దేహాల‌ను చూసి చ‌లించిపోయాడు. మృతుల్లో ఐదు నెల‌ల వ‌య‌స్సు ఉన్న కోమార్తె కోమ‌ల్‌తో పాటు రెండేళ్ల కుమారుడు బాల‌కిష‌న్ గొంతు కోసి హ‌త్య చేసిన‌ది జ‌యంతి. ప‌క్క‌నే కూర్చొని ఏడుస్తూ క‌నిపించింది. పిల్ల‌ల మృత‌దేహాల‌ను చూసి జ‌నం కూడ చ‌లించిపోయారు. స‌మాచారం తెలుసుకున్న భూటా పోలీసులు చిన్నారుల మృత‌దేహాల‌ను పోస్టుమార్టం కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. భ‌ర్త బంటూ ఫిర్యాదు మేర‌కు పోలీసులు జ‌యంతిని అరెస్టు చేశారు.

 

Visitors Are Also Reading