Home » కాంగ్రెస్ హామీలని అసెంబ్లీ లో ప్రస్తావిస్తాము: కడియం శ్రీహరి

కాంగ్రెస్ హామీలని అసెంబ్లీ లో ప్రస్తావిస్తాము: కడియం శ్రీహరి

by Sravya
Ad

ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఈరోజు ఆయన అసెంబ్లీ మీడియాతో మాట్లాడారు బడ్జెట్ సమావేశాలు ఉన్నప్పుడు అసెంబ్లీ పని దినాలని పెంచాలని చెప్పారు ప్రభుత్వం ఓటాన్ ఎకౌంటు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 12 రోజులు పాటు సమావేశాలు ని నిర్వహించాలని కోరామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీల మీద ప్రధాన ప్రతిపక్షం ఎక్కడ మమ్మల్ని ప్రశ్నిస్తారని తమకి భయపడే సమావేశాలు త్వరగా ముగుస్తున్నాయని కడియం శ్రీహరి అన్నారు.

Advertisement

Advertisement

ఆ తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజావాణి కార్యక్రమం అప్పుడే తుస్సుమందని అన్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక కాంగ్రెస్ చేతులెత్తేసిందని అన్నారు. గవర్నర్ తన ప్రసంగంలో ఎక్కడ కూడా హామీల మీద మాట్లాడలేదని అన్నారు త్వరలో లోక్సభ ఎన్నికల కోడ్ రాబోతుందని హామీలు ఎలా అమలు చేస్తారో చెప్పాలని కాంగ్రెస్ నేతలని హరీష్ రావు అడిగారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పడం జరిగింది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading