అన్నగారు ఎన్టీరామారావు తన సినిమాలతో నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. తెలగు ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. పౌరాణిక పాత్రల్లో నటించి ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకున్నారు. కేవలం సినిమాలతోనే కాకుండా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కూడా చరిత్ర సృష్టించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాల్లో రానించారు. ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు.
Advertisement
ఇక ఎన్టీఆర్ తరవాత ఆ పార్టీ పూర్తి భాధ్యతలు నారా చంద్రబాబు తీసుకున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా చంద్రబాబు కూడా ముఖ్యమంత్రిగా సేవలు అందించి పార్టీని నిలబెట్టారు. అయితే ప్రస్తుతం మాత్రం ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. అంతేకాకుండా టీడీపీ గట్టు పరిస్థితులను ఎదురుకుంటోంది.
Advertisement
దాంతో ఎన్టీరామారావు మనవడు తాత నటనను పునికిపుచ్చుకున్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని టీడీపీ పగ్గాలు చేతపట్టుకోవాలని కొంత మంది అభిమానులు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడూ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇవ్వలేదు. కాగా తాజాగా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఫ్యూచర్ అంటే నెక్స్ట్ సెకన్ అని అన్నారు.
భవిష్యత్ అంటే ఐదేళ్ల తరవాతనో పదేళ్లతరవాతనో కాదని చెప్పారు. ప్రస్తుతం తాను ఎంతో సంతోషంగా ఉన్నానని ఆశ్వాదిస్తు్న్నానని చెప్పారు. యాక్టింగ్ అనేది తనకు ఎనలేని సంతృప్తినిచ్చే పనిగా ఉందని..అందులోనే కొనసాగాలని అనుకుంటున్నట్టు ఎన్టీఆర్ తెలిపారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు కలెక్షన్ వర్షం కురుస్తోంది.