చాలా మంది సినిమా తారలు రాజకీయాల్లోనూ రానిస్తున్నారు. కొంతమంది పదవుల్లో కొనసాగుతుంటే మరికొంతమంది పార్టీలకు సేవ చేస్తున్నారు. ఇక అలా పార్టీలకు సేవ చేస్తున్న క్రమంలో పదవులను కూడా అందుకుంటున్నారు. ఇక ఏపీ రాజకీయాల్లో ఎక్కువ మంది నటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కమెడియన్ ఆలీ గత ఎన్నికల నుండి వైసీపీలో కొనసాగుతుండగా ఆయనకు ఇటీవల ఏపీ సర్కార్ కీలక పదవిని అందించింది.
Advertisement
Advertisement
అంతే కాకుండా నటుడు పోసాని కృష్ణమురళి కూడా వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు తాజాగా నటుడు జోగినాయుడు కు కూడా వైసీపీ సర్కార్ లో ఓ కీలక పదవి దక్కింది. జోగినాయుడును ఏపీ క్రియేటివ్ కల్చర్ కమిషన్ కు హెడ్ గా నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉత్వర్వుల్లో జోగినాయుడుకు ఎంత వేతనం చెల్లించనున్నారు అన్నది వెల్లడించలేదు. కానీ పీ కేటగిరీలో ఆయనకు వేతనం అందుతందని ప్రకటించారు. ఇదిలా ఉంటే జోగినాయుడు చాలా సినిమాలలో కమెడియన్ గా నటించాడు. జోగి బ్రదర్స్ అంటూ మరో నటుడితో కలిసి జంటగా సినిమాల్లో నటించాడు.