సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ లకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. చక్కగా నటించాలే గానీ ఆ తరవాత వరుస సినిమాలతో బిజీ అయిపోవచ్చు. ఇక ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా రానించిన చాలా మంది ప్రస్తుతం నటీనటులుగా మారుతున్న సంగతి తెలిసిందే. మరి కొందరు అయితే సినిమాలకు గుడ్ బై చెప్పి దూరంగా ఉంటున్నారు.
Advertisement
ఇక ఇప్పడు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఇప్పుడు చూడ్డానికి హీరోయిన్ లా మారిపోయిన ఓ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి తెలుసుకుందాం. నితిన్ హీరోగా తెరకెక్కిన జయం సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించగా హీరోయిన్ గా సదా నటించారు. ఈ సినిమా స్వచ్చమైన ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘనవిజయం సాధించింది. కాగా ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ప్రేక్షకుల మనసు దోచుకుంది.
Advertisement
సదా చెల్లెలిగా నటించిన ఆ అమ్మాయి అక్షరాలను రివర్స్ లో రాసూ తనకు టీచర్లు రివర్స్ లోనే నేర్పించారంటూ గమ్మత్తుగా మాట్లాడుతుంది. ఓ సీన్ లో నితిన్ కు అక్క ప్రేమగెలవాలని రైలుపట్టాలపై రివర్స్ లో రాస్తుంది. దాన్ని అద్దంలో చూసి నితిన్ అర్థం చేసుకుంటాడు. అలా మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ పేరు శ్వేతా యామిని…ఈ అమ్మాయి చిన్ననాటి నుండి చదువులో ముందు ఉండేది. జయం తరవాత ఒకటి రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీకి దూరమైంది. అంతే కాకుండా చూడ్డానికి హీరోయిన్ లా ఉన్నా కూడా చదువుపై ఆసక్తిఉండటంతో రీఎంట్రీ ఇవ్వలేదు.
చదువు పూర్తిచేసుకుని విప్రోలో ఉద్యోగం చేసింది. ఇక ప్రస్తుతం యామిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది. అక్కడ ఓ ప్రముక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టు సమాచారం. అంతే కాకుండా ప్రస్తుతం యామినికి ఒక కూతురు కూడా ఉంది. ఇదిలా ఉండగా యామిని ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటోంది. దాంతో జయం చైల్డ్ ఆర్టిస్ట్ అంటూ ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.