Home » చార్మి-పూరీ మధ్య పెరిగిన దూరం..వారి మధ్య వైరానికి అసలు కారణం ఇదేనా..?

చార్మి-పూరీ మధ్య పెరిగిన దూరం..వారి మధ్య వైరానికి అసలు కారణం ఇదేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరుపొందాడు దర్శకుడు పూరి జగన్నాథ్. అలాగే ఒకప్పుడు ఎన్నో సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది హీరోయిన్ ఛార్మి. వీరిద్దరి మధ్య సంథింగ్, సంథింగ్ ఏదో నడుస్తుందని గత కొద్దిరోజుల నుంచి ఇండస్ట్రీలో ప్రచారం సాగుతూనే ఉంది. దీన్ని వారు ఖండిస్తూ మా మధ్య ఏమీ లేదు అని చెప్పినా కానీ ప్రచారాలు ఆగలేదు.. కానీ వీరు కలిసి తిరగడం, కలిసి విదేశాలకు వెళ్లడం ఆ ఫోటోలు షేర్ చేయడంతో అందరూ అనుకున్నదే నిజమైంది.. ఇటీవల వీరిద్దరు కలిసి చేసిన మూవీ లైగర్..

Advertisement

 

also read:అసలు నా కూతురివి కాదంటూ.. అన్షుపై ఎమోషనల్ కామెంట్స్ చేసిన రోజా.. అలా ఎందుకు మాట్లాడిందబ్బా..!!

Advertisement

ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఒకరోజు తర్వాత నుండి చాలా సైలెంట్ అయిపోయింది . కానీ సోషల్ మీడియా మాత్రం విడిపోతున్నాం.. నేను వెళ్ళిపోతున్నాను అని చెబుతూనే.. తనపై.. పూరి పై మొత్తం ప్రొడక్షన్ హౌస్ పూరి కనెక్ట్ పై వస్తున్నటువంటి రూమర్లకు .. కౌంటర్ ఇస్తూనే ఉంది.. ఇటీవల తనకీ పూరికి గొడవలు జరిగాయని వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చింది చార్మి.. ఈ వార్తలన్నీ మా పై వస్తున్న రూమర్స్,రూమర్స్, రూమర్స్ అంటూ ట్వీట్ చేశారు. త్వరలోనే పూరి కనెక్ట్స్ మళ్లీ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తుందని క్లారిటీ ఇచ్చేసారు.. ఏ విషయం అయినా మేము అధికారికంగా చెప్పే వరకు అది రూమరే అంటూ చెప్పుకోచ్చింది.. ఇప్పటికీ మా ఫ్రెండ్ షిప్ పదిలంగానే ఉందని తెలియజేసింది ఛార్మి.

అయితే ప్రముఖ సీనియర్ జర్నలిస్టు పూరి రిలేషన్ పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడం చార్మి వల్లే అని అన్నారు.. లైగర్ చిత్రం ఫ్లాప్ అవ్వడం ఛార్మి వల్ల అయిందని అంటున్నారని అయితే ఇది నిజం కాదని అన్నారు.. సినిమా కథ, కథనం సరిగ్గా ఉంటే ఏ సినిమా అయినా హిట్ అవుతుందని తెలియజేశారు. అయితే వీరిద్దరు విడిపోతున్నాం అనే విషయంలో వాస్తవం లేదని అవన్నీ రూమర్సే అంటూ క్లారిటీ ఇచ్చారు జర్నలిస్టు.

also read:ఏఎన్ఆర్ ను ఎంత‌గానో ఆరాధించే దాస‌రితో ఎందుకు గొడ‌వ‌లు జ‌రిగాయి….?ఆ గొడ‌వ‌ల‌కు కార‌ణం ఎవ‌రు..?

Visitors Are Also Reading