Home » రూ.50 కోసం పూరీ జగన్నాథ్ ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

రూ.50 కోసం పూరీ జగన్నాథ్ ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

సాధారణంగా  భూములను కొనవచ్చు.. వస్తువులను కొనవచ్చు.. అదేవిధంగా డబ్బులతో మనుషులను కూడా కొనవచ్చు. కానీ టాలెంట్ ను  మాత్రం  ఎవరు కొనలేరు.  దీనికి ఉదాహరణ చిన్నప్పుడు మనకు గురువులు చెబుతుండేవారు. విద్యను మన వద్ద నుంచి ఎవ్వరు దోచుకోలేరు అందుకే ప్రతీ ఒక్కరూ చదువుకోవాలని సూచించారు. అలాగే  టాలెంట్ ఉంటే ఒక్క రూపాయి కూడా చేతిలో లేకున్నా అనుకున్నది సాధించడం కోసం ఎంతో కష్టపడి పేరు ప్రఖ్యాతలతో పాటు డబ్బు సంపాదించుకున్న వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో పూరి జగన్నాథ్ కూడా ఒకరు.

Advertisement

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఉన్న ఆయన ఇడియట్, శివమణి, బద్రి, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, ఇస్మార్ట్ శంకర్, పోకిరి వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకు డైరెక్షన్ చేశారు. అలాంటి పూరి ఇంతటి స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారట. ఆయన ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్నో కథలు రాశారట. అయితే ఆ కథలను ఇంకొకరికి అందిస్తే వారి 50 రూపాయల నుంచి 100 రూపాయలు ఇచ్చేవారని ఆ సంపాదనతో ఆయన బ్రతికే వారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

Advertisement

అంతేకాకుండా పూరి జగన్నాథ్ ఒక ప్రముఖ మ్యాగజిన్ ప్రింట్ చేసే యానిమేటెడ్ షార్ట్ స్టోరీ కి బొమ్మలు కూడా గీసిచ్చారట. అలా బొమ్మలు గీసినందుకు ఆ మ్యాగజిన్ వారు పూరికి వారానికి 50 రూపాయలు మాత్రమే ఇచ్చేవారట. అలా 50 రూపాయల ప్రస్థానం నుంచి తన దర్శకత్వ స్కిల్స్ తో అద్భుతమైన కథలు రాసి ఎంతో మంది హీరోలను స్టార్ హీరోలుగా మలిచారు పూరి జగన్నాథ్. అలాంటి ఆయన లైఫ్ మీద ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి లైగర్ సినిమా పెద్ద దెబ్బ కొట్టింది. ఈ దెబ్బ తర్వాత ఆయన రామ్ పోతినేని తో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

చిరంజీవి-సురేఖ పెళ్లి పత్రికలో వీరి పేర్లను మీరు గమనించారా ?

మెగాస్టార్ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా ?

 

Visitors Are Also Reading