Home » Pitru dosham:ఇంట్లో ఈ 3 సంకేతాలు కనిపిస్తే పితృ దోషం ఉన్నట్టే..!!

Pitru dosham:ఇంట్లో ఈ 3 సంకేతాలు కనిపిస్తే పితృ దోషం ఉన్నట్టే..!!

by Sravanthi Pandrala Pandrala

భారతదేశమంటేనే సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక్కడ ఎన్నో సాంప్రదాయాలు పూర్వకాలం నుంచే పాటిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మన చనిపోయిన పూర్వీకులను కూడా మనం దేవుళ్ళలా పూజిస్తాం. మన పూర్వీకులకు గ్రంథాలలో మంచి స్థానం ఉంది. ఎవరి వల్ల మన వంశం ముందుకు సాగుతుందో వారిని పూర్వికులుగా పూజిస్తూ ఉంటాం. అయితే నిజానికి కొన్ని సంఘటనల వల్ల పితృ దోషం కలుగుతుందట. మరి ఆ సంఘటనలు ఏంటో చూద్దామా.

1. అధిక ఒత్తిడి:

కొంతమంది ఇండ్లలో ఎలాంటి కారణం లేకున్నా కాని అత్యధిక టెన్షన్ కి గురవుతూ ఉంటారు. ఇలా కావడం అనేది పితృ దోషంలో భాగమని చెప్పవచ్చు. ఈ సమయంలో సమస్యను పెంచే బదులు పితృ దోషాన్ని వదిలించుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.

#2. రావి మొక్క పెరగడం:

చాలావరకు మనం రావి మొక్కలను అడవిలో లేదంటే ఏదైనా దేవాలయాల్లో మాత్రమే చూస్తాం. ఒకవేళ మీ ఇంటి ఆవరణలో రావి మొక్క పెరిగినట్టు కనబడితే మాత్రం పితృదోషం ఉన్నట్టే.అంటే మీ పూర్వీకులు మీపై కోపంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. వారిని శాంతపరచడం కోసం చేయాల్సిన పనులు చేయాలి.
#3. అనారోగ్యం:

మీ ఇంట్లోని వ్యక్తులు ప్రతి సారి అనారోగ్యంగ వల్ల బాధపడుతూ, ఎన్నిసార్లు చికిత్స చేయించినా మెరుగుపడకపోతే పితృ దోషం కావచ్చు. కాబట్టి జ్యోతిష్య నిపుణులను సంప్రదించి ఈ దోషం నుంచి బయటపడే మార్గాలను కనుక్కోవాలి.

మరి కొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading