Home » ఆ లాజిక్ ప్రకారం సర్కారు వారి పాట కూడా ప్లాప్..! నెటిజన్స్ వెతికి మరీ ఇచ్చిన ఆ లాజిక్ ఏంటంటే.. ?

ఆ లాజిక్ ప్రకారం సర్కారు వారి పాట కూడా ప్లాప్..! నెటిజన్స్ వెతికి మరీ ఇచ్చిన ఆ లాజిక్ ఏంటంటే.. ?

by AJAY
Ad

సినిమాల విష‌యంలో ద‌ర్శ‌కులు, హీరోల టాలెంట్ తో పాటూ కొన్నిసార్లు లాజిక్ ల‌ను కూడా న‌మ్ముతుంటారు. వ‌రుస ఫ్లాప్ లు ఇస్తే ఆ హీరోయిన్ జోలికి కూడా పోరు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ లు ఇప్పుడు శ‌ని పూజ‌లు కూడా చేయించుకుంటున్నారు. ఇదొక్క‌టే కాదు ఇంకా చాలా లాజిక్ ల‌ను మేక‌ర్స్ తో తో పాటూ సినిమా ప్రేక్ష‌కులు ప‌ట్టించుకుంటారు. కాగా తాజాగా ఇప్పుడు ఓ ఆసక్తిక‌ర వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Advertisement

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన సినిమా రాధేశ్యామ్..ఈ సినిమా ఎన్నో అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పామిస్ట్రీ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించింది. కాగా ఈ సినిమా అనుకున్న‌మేర విజ‌యం సాధించలేదు. ఇక ఈ సినిమా త‌ర‌వాత రీసెంగ్ ఆచార్య సినిమా విడుద‌లైంది.

radhe shyam

radhe shyam

ఈ సినిమాకు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా న‌టించగా రామ్ చ‌ర‌ణ్ కూడా ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా న‌టించింది. అయితే ఈ సినిమా కూడా బోల్తా కొట్టింది. దాంతో పూజా వ‌రుస ఫ్లాపులు కొడుతోంద‌ని ఐర‌న్ లెగ్ అని ముద్ర‌వేశారు. ఇక ఇప్పుడు స‌ర్కారు వారి పాట సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది.

Advertisement

ఈ సినిమాకు ప‌రషురాం ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించ‌లేదు. కానీ మ‌రో లాజిక్ తో ఈ సినిమా కూడా పోతుంద‌ని నెట్టింట ట్రోల్స్ క‌నిపిస్తున్నాయి. ఇటీవ‌ల ఏపీలో టికెట్ ధ‌ర‌ల‌ను త‌గ్గించాల‌ని కొంత‌మంది టాలీవుడ్ హీరోలు ఏపీ సీఎం జ‌గ‌న్ వ‌ద్దకు వెళ్లిన సంగ‌తి తెలిసిందే.

అయితే వెళ్లిన వారిలో ప్ర‌భాస్, మెగాస్టార్ తో పాటూ మ‌హేశ్ బాబు ఉన్నారు. కాగా ప్ర‌భాస్ రాధేశ్యామ్, చిరు ఆచార్య ఫ్లాప్ అయ్యాయి. ఇక ఇప్పుడు మ‌హేశ్ బాబు సినిమా కూడా అంతేనా అంటూ నెట్టింట ట్రోల్స్ వ‌స్తున్నాయి. మ‌రి ఈ సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

ALSO READ :

ఆచార్య‌కు నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌లేదు…వైర‌ల్ అవుతున్న కొరాటాల కామెంట్స్..!

Visitors Are Also Reading