Home » కొత్త బంగారు లోకం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!

కొత్త బంగారు లోకం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!

by AJAY
Ad

కొత్త‌బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ శ్వేత బ‌సు ప్ర‌సాద్. వ‌రుణ్ సందేశ్ హీరోగా న‌టించిన ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఇంటర్ బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చిన ఈ చిత్రానికి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో న‌టించిన స‌మ‌యంలో శ్వేత వ‌య‌సు కేవ‌లం 17 ఏళ్లే కానీ త‌న న‌ట‌న‌తో ఆమె అవాక్క‌య్యేలా చేసింది. నిజానికి శ్వేత బ‌సు ప్ర‌సాద్ కొత్త‌బంగారు లోకం సినిమా కంటే ముందే బాలీవుడ్ లో బాల‌న‌టిగా సినిమాలు చేసింది.

Advertisement

కానీ హీరోయిన్ గా ప‌రిచ‌మైంది మాత్రం కొత్త‌బంగారులోకం సినిమాతోనే. ఇక ఈ చిత్రంలో ఎక్క‌డా….ఎప్పుడూ అంటూ ధీర్ఘాలు తీస్తూ శ్వేత చెప్పే డైలాగులు ప్రేక్ష‌కుల‌కు ఇప్ప‌టికీ గుర్తుండి పోయాయి. ఈ సినిమా మంచి స‌క్సెస్ ను అందించినా ఆ త‌ర‌వాత మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎద‌గ‌లేక‌పోయింది. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ బాలీవుడ్ లో అవ‌కాశాల కోసం ప్ర‌యత్నాలు జ‌రిపింది. అడ‌పా ద‌డపా సినిమాలు మ‌రియు వెబ్ సిరీస్ ల‌లో న‌టించింది.

Advertisement

ఇక కొంత కాలం పాటూ పోలీస్ కేసుల్లో చిక్కుకుని క‌ష్టాలు కూడా అనుభ‌వించింది. అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఫిల్మ్ మేక‌ర్ రోహిత్ మిట్ట‌ల్ తో ప్రేమాయ‌ణం న‌డింపించి అత‌డిని 2018 లో వివాహం చేసుకుంది. అయితే పెళ్లి జీవితం కూడా శ్వేత బసు జీవితంలో ఆనందాల‌ను నింప‌లేదు.

 

దాంతో పెళ్లైన ఏడాదికే త‌న భ‌ర్త‌తో విడిపోతున్నట్టు ప్ర‌క‌టించేసింది. అంతే కాకుండా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న భ‌ర్త ప‌లు మార్లు త‌న గ‌తం గురించి మాట్లాడుతూ టార్చ‌ర్ పెట్టేవాడ‌ని తెలిపింది.

 ఇదిలా ఉంటే శ్వేత మ‌ళ్లీ సినిమా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. మ‌రి ఈ హీరోయిన్ కు సెకండ్ ఇన్నింగ్స్ అయినా క‌లిసి వ‌స్తుందో లేదో చూడాలి.

Visitors Are Also Reading