Home » భీమిలి కబడ్డీ జట్టు హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందొ చూడండి!

భీమిలి కబడ్డీ జట్టు హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందొ చూడండి!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

నాని హీరోగా వచ్చిన సినిమా భీమిలి కబడ్డీ జట్టు. చిన్న సినిమాగానే వచ్చినప్పటికీ.. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మాయి శరణ్య మోహన్ గురించి పరిచయం అవసరం లేదు. తమిళ నటి అయిన శరణ్య మోహన్ పలు తెలుగు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అచ్చ తెలుగు ఆడపిల్లలా కనిపించే శరణ్య మోహన్ కు తెలుగునాట చాలా మందే అభిమానులు ఉన్నారు.

Advertisement

భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో అమాయకమైన అమ్మాయిగా కనిపించిన శరణ్య మోహన్ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసారు. ఆ తరువాత కూడా తెలుగు లో కొన్ని సినిమాలలో నటించారు. కానీ, తెలుగు లో కంటే ఎక్కువగా ఆమె తమిళ సినిమాలలోనే నటించారు. ప్రస్తుతం ఆమె తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నారు. మొత్తంగా దాదాపు పాతిక సినిమాలలో శరణ్య మోహన్ నటించారు. 2014 లో శరణ్య మోహన్ వివాహం చేసుకున్నారు. వివాహం తరువాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

Advertisement

సినిమాలకు దూరం అయినప్పటికీ.. శరణ్య మోహన్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ తన అభిమానులతో టచ్ లోనే ఉంటున్నారు. తాజాగా.. శరణ్య మోహన్ తన ఇద్దరు పిల్లలతో కలిసి తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు పిల్లలు పుట్టినా.. శరణ్య మోహన్ లో పెద్దగా మార్పేమీ లేదు. అదే అందంగా, అవే అమాయకమైన కళ్ళతో అందంగా ఉన్నారు. ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి మరి.

 చెన్నై, బెంగళూరులో రజినీ జైలర్ ఫీవర్.. ఆఫీస్ లకు సెలవు, ఫ్రీ టికెట్స్..!

బాలకృష్ణ డేట్స్ కోసం ఆ స్టార్ డైరెక్టర్ ఎదురుచూస్తున్నాడా ? 

Visitors Are Also Reading