Home » ఫేక్ క‌లెక్ష‌న్లు అంటూ సిద్ధార్థ్ సంచ‌ల‌నం…కొట్టుకుంటున్న బ‌న్నీ మ‌హేశ్ ఫ్యాన్స్..!

ఫేక్ క‌లెక్ష‌న్లు అంటూ సిద్ధార్థ్ సంచ‌ల‌నం…కొట్టుకుంటున్న బ‌న్నీ మ‌హేశ్ ఫ్యాన్స్..!

by AJAY
Ad

ల‌వర్ బాయ్ సిద్ధార్థ్ పాన్ ఇండియా సినిమాల వ‌సూళ్ల విష‌యంలో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. పాన్ ఇండియా సినిమాల క‌లెక్ష‌న్ల‌లో నిర్మాత‌లు అబ‌ద్దాలు చెబుతున్నారంటూ ఆరోపించారు. అన్ని ప‌రిశ్ర‌మల‌లోనూ అదే తీరు క‌నిపిస్తుందని…తప్పుడు లెక్క‌లను అధికారికంగా ప్ర‌క‌టిస్తున్నారంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అంటూ సంచ‌ల‌న వ్యాక్య‌లు చేశాడు. ట్రేడ్ వ‌ర్గాలు మీడియా కూడా అదే దారిలో ఉన్నాయంటూ సిద్దార్థ్ ఆరోపించారు.

siddarth

siddarth

పాన్ ఇండియా వ‌సూళ్ల విష‌యంలో నిజాయితీ లోపించింద‌ని…త‌ప్పుడు వ‌సూళ్లు చూపించేందుకు ఎంత క‌మీష‌న్ తీసుకుంటున్నారు అంటూ సిద్ధార్థ్ ఫైర్ అయ్యారు. అంతే కాకుండా ఎంత ఇష్టమైన సినిమా అయినా ప‌దే ప‌దే చూసే అల‌వాటు త‌న‌కు లేద‌ని తెలిపాడు. ద‌ర్శ‌కులు కొత్త క‌థ‌ల‌ను తెర‌కెక్కించాలంటూ సిద్ధార్థ్ హిత‌వు ప‌లికారు. ఇదిలా ఉంటే సిద్ధార్థ్ ఏ సినిమాను ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేశారో తెలియ‌డం లేదు గానీ అల్లు అర్జున్ మ‌రియు మ‌హేశ్ అభిమానులు కామెంట్ సెక్ష‌న్ లో ఫైట్ చేసుకుంటున్నారు.

Advertisement

Advertisement

సిద్ధార్థ్ పెట్టిన పోస్టు బ‌న్నీ సినిమా పుష్ప గురించే అని ఆ సినిమా క‌లెక్ష‌న్ల విష‌యంలోనే త‌ప్పుడు ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయ‌ని మ‌హేశ్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతుంటే… అంత‌లేద‌ని మీ హీరోవే త‌ప్పుడు ప్ర‌చారాలు అంటూ అల్లు అర్జున్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అంతే కాకుండా గ‌తంలో మ‌హేశ్ సినిమాల‌కు వ‌చ్చిన క‌లెక్ష‌న్ల‌కు సంబంధించిన వివరాల‌ను కూడా షేర్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు సిద్ధార్థ్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. అస‌లే కెరీర్ అంతంత మాత్రంగా ఉన్న సిద్ధార్థ్ ఇప్పుడు నిర్మాత‌ల‌పై ద‌ర్శ‌కుల‌పై ఇలా ఆరోప‌ణ‌లు చేయడం అవ‌స‌ర‌మా అని సినీ ల‌వ‌ర్స్ అనుకుంటున్నారు.

Visitors Are Also Reading