Home » కల్ట్ క్లాసిక్ అతడు 2 పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత మురళీమోహన్! ఎప్పుడంటే..?

కల్ట్ క్లాసిక్ అతడు 2 పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత మురళీమోహన్! ఎప్పుడంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో హీరో మహేష్ బాబు అంటే తెలియని వారుండరు. ఆయన ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి మహేష్ బాబు అంటే అమ్మాయిలు పడి చస్తారు. ఆయనకు అబ్బాయిలకంటే అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి స్టార్ హీరో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో “అతడు ” మూవీ చేశారు. ఇందులో మహేష్ బాబు సరసన త్రిష నటించింది. ఈ మూవీ జయభేరి ఆర్ట్స్ బ్యానర్ పై ఎం రామ్మోహన్, డి. కిషోర్ లు కలిసి నిర్మించారు. ఈ చిత్రం 2005 ఆగస్టు 10న విడుదల అయింది.

Advertisement

ఈ సినిమాతో మహేష్ బాబు ఇండస్ట్రీ లోనే పెద్ద హిట్ అందుకున్నాడు. ఈ సినిమా మహేష్ బాబు సినీ కెరీర్ లోనే ది బెస్ట్ చిత్రంగా మిగిలిపోయింది. ఇప్పటికీ మూవీ టీవీలో వస్తే ఎంతోమంది పనులు పక్కన పెట్టుకొని మరీ చూస్తారు. ఈ సినిమాను ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అంటే ఈ మూవీ రేంజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో కీలక నటులుగా కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్, మరీ ముఖ్యంగా విలన్ గా సోనూసూద్ నటించారు. ఈ మూవీ అప్పట్లోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పర్వం కురిపించింది. ఈ మూవీకి 12 కోట్ల బడ్జెట్ పెట్టారు. అప్పటివరకు మురళీమోహన్ నిర్మించిన సినిమాల్లో ఈ మూవీకి భారీ బడ్జెట్. ఇక వసూళ్ళ విషయానికి వస్తే 25 కోట్ల రూపాయలు వసూలు చేసి బళా అనిపించుకుంది ఈ చిత్రం.

Advertisement

ఇదే తరుణంలో మురళీమోహన్ మరొక సెన్సేషనల్ విషయాన్ని బయటపెట్టారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అతడు 2 ఉంటుందా అని యాంకర్ ప్రశ్నించగా చేస్తే బాగుంటుందని, మహేష్ బాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హోదా లో ఉన్నారని, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారని, వారిద్దరి కాంబినేషన్లో మళ్లీ సినిమా వచ్చే అవకాశం ఉందని, త్రివిక్రమ్, మహేష్ బాబు డిసైడ్ అయితే తప్పకుండా అతడు 2 తీసుకొస్తే బాగుంటుందని మురళీమోహన్ అన్నారు. ఈ సినిమా చేయాలనే ఆలోచన ఉందని కానీ వారిద్దరూ ఓకే అయితే తప్పకుండా సినిమా వస్తుందని క్లారిటీ ఇచ్చారు.

also read:

Visitors Are Also Reading