Home » షర్మిల కుమారుడి వివాహానికి.. జోధ్ పూర్ లో ఘనంగా ఏర్పాట్లు..!

షర్మిల కుమారుడి వివాహానికి.. జోధ్ పూర్ లో ఘనంగా ఏర్పాట్లు..!

by Anji
Ad

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియ వివాహ వేడుకలను రాజస్థాన్ జోధ్ పూర్ ప్యాలెస్ లో ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 17న నిర్వహించేందుకు 16వ తేదీ నుంచి ఈరోజు వరకు కూడా వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ ఉదయం ప్రత్యేక ప్రార్థనలు జరుగుతుండగా.. సాయంత్రం తలంబ్రాల వేడుకలు నిర్వహించనున్నారు.

Advertisement

Advertisement

షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియ ల నిశ్చితార్థ వేడుకలు జనవరి 18న హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు జరిగిన వివాహ వేడుకలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తాాాజాగా ట్విట్టర్ వేదికగా వైఎస్ షర్మిల హల్దీ ఫంక్షన్ ఫొటోలను సేర్ చేశారు.

మరోవైపు కంగ్రాట్స్ రాజా, ప్రియా అంటూ విషెష్ చెప్పారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి ఘనంగా జరుగుతుంటే మేనమామ సీఎం జగన్ మాత్రం వివాహానికి హాజరు కాలేదు. షర్మిల  సీఎం జగన్ పై చేసిన విమర్శలే ఇందుకు కారణం అని తెలుస్తోంది.

Also Read :  షర్మిల కుమారుడి వివాహం.. సీఎం జగన్ షాకింగ్ నిర్ణయం..!

Visitors Are Also Reading