Home » ఆండ్రాయిడ్ మొబైల్ కొనాలనుకునే వారికి శుభవార్త..ఈ కంపెనీ స్మార్ట్ ఫోన్ ధర తగ్గింది..!!

ఆండ్రాయిడ్ మొబైల్ కొనాలనుకునే వారికి శుభవార్త..ఈ కంపెనీ స్మార్ట్ ఫోన్ ధర తగ్గింది..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుత కాలంలో ఒక పూట ఆహారం లేకుండా బ్రతుకుతున్నారు కానీ మొబైల్ లేకుండా బతకడం కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో మార్కెట్లోకి అనేక కొత్త కొత్త మొబైల్స్ వస్తూ ఉంటాయి. మొబైల్స్ ఏ విధంగా వస్తున్నాయో ఆ విధంగానే ఫీచర్స్ కూడా ఉంటున్నాయి. అయితే వినియోగదారుడు ఏదైనా మొబైల్ కొనాలంటే ధర తక్కువ ఫీచర్స్ ఎక్కువ ఉండాలని అనుకుంటారు.. అలాంటి మొబైల్సే ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చాయి. అన్ని ఫీచర్స్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ ధరను తగ్గించింది.. మరి ఆ ఫోన్ ఏంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ALSO READ:

Advertisement

ప్రస్తుతం ఉన్న మొబైల్ బ్రాండ్లలో వన్ ప్లస్ ఒకటి.. ఈ మొబైల్ ఫోన్ లో అనేక ఫీచర్లు ఉంటాయి. ఈ మొబైల్ ఫోన్ నుండి 4 నెలల క్రితం 20 వేల లోపు బడ్జెట్ తో ఒక స్మార్ట్ ఫోన్ విడుదలైంది.. దాని పేరే One plus nord CE 2 lite 5g.ఈ మొబైల్ ని 20 వేల లోపే రిలీజ్ చేసి వన్ ప్లస్ సంచలనం సృష్టించింది. దీంతో ఈ మొబైల్ పాపులర్ అయింది. ఈ మొబైల్ రిలీజ్ అయినప్పుడు ఉన్నటువంటి ధరలు, ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే 6gb ర్యాం +128 జీబీ స్టోరేజ్,మొబైల్ ధర 19,999 కాగా,8 జీబీ రాం+128 జీబీ వేరియంట్ ధర 21,999 రూపాయలు.. ప్రస్తుతం ఈ మొబైల్ ఫోన్ ధర వేయి రూపాయలు తగ్గింది.. . ప్రస్తుతం వన్ ప్లస్ నార్డ్ సిఈ 2 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ 6 జీబీ +128 జీబీ వేరియంట్ ధర 18,999 రూపాయలు.

Advertisement

కాగా 8 జీబీ +128 జీబీ వేరియంట్ ధర 20,999 రూపాయల ఎస్బిఐ కార్డు తో కొంటె వెయ్యి రూపాయల తగ్గింపుకు వస్తోంది. ఇదే ఆఫర్ తో 6జీబీ+128 జీబీ వేరియంట్ల ధర 17,999 రూపాయలు,8జీబీ +128 జీబీ వేరియంట్ ను 19,999 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు. ఈ మొబైల్ ఫోన్ యొక్క ఇతర ఫీచర్స్ చూస్తే 120 HZ రిఫ్రెష్ రేట్ తో 6.59 అంగుళాల ఫుల్ హెచ్ డి ఎల్ సీడి డిస్ ప్లే ఉంటుంది. ఇందులో రాం ఎక్స్పాండ్ ఫీచర్ కూడా ఉంది. 5 జి ర్యామ్ ను పెంచుకోవచ్చు. త్రిబుల్ కెమెరా ఇక అనేకరకాల ఫీచర్స్ తో ఈ మొబైల్ అందుబాటు ధరలో లభిస్తోంది.

ALSO READ:

Visitors Are Also Reading