Home » ఢిల్లీ క్యాపిటల్స్ కి గుడ్ న్యూస్..రిషబ్ పంత్ కి లైన్ క్లియర్..!

ఢిల్లీ క్యాపిటల్స్ కి గుడ్ న్యూస్..రిషబ్ పంత్ కి లైన్ క్లియర్..!

by Anji
Ad

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ కి నేషనల్ క్రికెట్ అకాడమీ క్లియరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్సీఏ ఎన్ఓసీతో ఐపీఎల్ 2024 సీజన్ ఆడేందుకు రిషబ్ పంత్ కి లైన్ క్లియర్ అవ్వనుంది.  ఎన్సీఏ నుంచి అధికారికంగా అనుమతి లేకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ పేరును జట్టులో చేర్చలేదు. గత కొద్ది రోజులుగా పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్ క్యాంప్ తో  కఠోరంగా శ్రమిస్తున్నాడు. అతని ఫిజికల్ ఫిట్నెస్ చూస్తే మనుపటి తరహాలో కనిపిస్తుంది. ప్రాక్టీస్ క్యాంప్లో పంత్ మునుపటిలా భారీ షాట్లు ఆడాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

Advertisement

Advertisement

అయితే పంత్ వికెట్ కీపింగ్ చేయడంపై మాత్రం డీసీ యాజమాన్యం ఆఖరి నిమిషం వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోదని తెలుస్తుంది. పంత్ కెప్టెన్గా, బ్యాటర్గా మాత్రమే అందుబాటులో ఉంటాడని పలు నివేదికలు తెలుపుతున్నాయి. 2022 డిసెంబర్ 31న పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతను క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. కొద్ది రోజుల కిందటే అతను తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. పంత్ ఎన్సీఏలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. వీరు క్లీన్ చిట్ ఇస్తేనే పంత్ ఐపీఎల్ 2024లో అడతాడు. పంత్ గైర్హాజరీలో గతేడాది డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా వ్యవహరించాడు.

ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. సీజన్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ తొలి మ్యాచ్ను మార్చి 23న ఆడనుంది. ఈ మ్యాచ్లో డీసీ.. పంజాబ్ కింగ్స్ తలపడనుంది. తొలి విడతలో క్యాపిటల్స్ ఐదు మ్యాచ్లు ఆడనుంది. పంజాబ్ తో (మార్చి 23), రాజస్థాన్ (మార్చి 28), సీఎస్కే (మార్చి 31), కేకేఆర్ (ఏప్రిల్ 3), ముంబై ఇండియన్స్ తో (ఏప్రిల్ 7) డీసీ ఢీ కొట్టనుంది.

Also Read :  చివరి టెస్ట్ లో ఇంగ్లండ్ చిత్తు.. 4-1 తేడాతో సిరీస్ భారత్ కైవసం..!

Visitors Are Also Reading